మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నారు. అలానే మెహర్ రమేష్, బాబీ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ కుటుంబానికి చెందిన ఓ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో చిరంజీవి చిన్న కూతురు తను ప్రేమించివాడితో వెళ్లిపోయింది. ఆ విషయంలో మెగాస్టార్ చాలా బాధ పడ్డారు.
కానీ శ్రీజ తన భర్తతో విడిపోయి మళ్లీ తండ్రి దగ్గరకే వచ్చింది. కుటుంబంతో కలిసి ఉంటూ తన విడాకుల బాధను మర్చిపోయింది. కొన్నాళ్లకు చిరు తన స్నేహితుడి కొడుకు కళ్యాణ్ దేవ్ తో శ్రీజకు రెండో పెళ్లి చేశారు. స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు.
కానీ ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారని వార్తలొచ్చాయి. దానికి తగ్గట్లే శ్రీజ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో తన పేరు పక్కన భర్త పేరును తొలగించింది. దీంతో విడాకుల వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తన చిన్న కూతురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారట.
శ్రీజ, కళ్యాణ్ దేవ్ లను కూర్చోబెట్టి ప్యాచప్ చేయడానికి ట్రై చేసినట్లు తెలుస్తోంది. మెగాఫ్యామిలీకి చెందిన కొందరు సభ్యులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారట. కానీ శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల మధ్య సఖ్యత రాకపోగా.. మరింత దూరం పెరిగిందని సమాచారం. కూతురికి నచ్చజెప్పలేక చిరు కూడా సైలెంట్ అయిపోయారట. త్వరలోనే శ్రీజ తన విడాకుల విషయాన్ని అఫీషియల్ గా చెప్పే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on January 19, 2022 10:20 am
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…