సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఈజీగా చేసేస్తాడు అక్షయ్ కుమార్. పక్కా ప్లానింగ్తో, పర్ఫెక్ట్ షెడ్యూల్స్తో సినిమాలు కంప్లీట్ చేయడం అతన్ని చూసే నేర్చుకోవాలి అంటారంతా. కొవిడ్ ఎఫెక్ట్ ఓ రేంజ్లో ఉన్నప్పుడు కూడా పని చేయడం ఆపలేదు అక్కీ. తనదైన స్పీడులో ప్రాజెక్టులైతే పూర్తి చేశాడు.కానీ వాటిని రిలీజ్ చేయడం మాత్రం ఎవరి వల్లా కాలేదు.
మహారాష్ట్రలో థియేటర్లు చాలాకాలం తెరుచుకోకపోవడంతో అక్షయ్ నటించిన చాలా సినిమాలు రిలీజ్కి నోచుకోలేదు. దాంతో కొన్నింటిని ఓటీటీల్లో విడుదల చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక బెల్ బాటమ్, సూర్యవంశీ, అత్రంగీరే చిత్రాలతో మళ్లీ థియేటర్స్లో సందడి చేశాడు అక్షయ్. అయితే బచ్చన్ పాండే మూవీ మాత్రం రిలీజ్ కోసం నానా తంటాలూ పడింది.
2020 క్రిస్మస్కి విడుదలవ్వాల్సిన సినిమా ఇది. 2021 జనవరి 22కి వాయిదా పడింది. సెకెండ్ వేవ్ వల్ల మరోసారి ఆగింది. దాంతో ఇక ఓటీటీ రిలీజ్కి ఫిక్సయ్యారనే వార్తలు వచ్చాయి. అది నిజం కాదని ఇప్పుడు తేలింది. బచ్చన్ పాండే చిత్రాన్ని వచ్చే మార్చ్ 18న థియేటర్స్లో విడుదల చేయనున్నట్టు ప్రకటన వచ్చింది.
ఫర్హాద్ సామ్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సిద్ధార్థ్, బాబీ సింహా నటించిన తమిళ సూపర్ హిట్ ‘జిగర్తాండ’కి రీమేక్. కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు. అర్షద్ వార్శి, పంకజ్ త్రిపాఠి, ప్రతీక్ బబ్బర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు కానీ థర్డ్ వేవ్ అంతకంతకూ టెన్షన్ పెడుతోంది కాబట్టి మార్చ్లో మూవీ రిలీజవుతుందో లేక మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి.
This post was last modified on January 19, 2022 8:34 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…