సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఈజీగా చేసేస్తాడు అక్షయ్ కుమార్. పక్కా ప్లానింగ్తో, పర్ఫెక్ట్ షెడ్యూల్స్తో సినిమాలు కంప్లీట్ చేయడం అతన్ని చూసే నేర్చుకోవాలి అంటారంతా. కొవిడ్ ఎఫెక్ట్ ఓ రేంజ్లో ఉన్నప్పుడు కూడా పని చేయడం ఆపలేదు అక్కీ. తనదైన స్పీడులో ప్రాజెక్టులైతే పూర్తి చేశాడు.కానీ వాటిని రిలీజ్ చేయడం మాత్రం ఎవరి వల్లా కాలేదు.
మహారాష్ట్రలో థియేటర్లు చాలాకాలం తెరుచుకోకపోవడంతో అక్షయ్ నటించిన చాలా సినిమాలు రిలీజ్కి నోచుకోలేదు. దాంతో కొన్నింటిని ఓటీటీల్లో విడుదల చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక బెల్ బాటమ్, సూర్యవంశీ, అత్రంగీరే చిత్రాలతో మళ్లీ థియేటర్స్లో సందడి చేశాడు అక్షయ్. అయితే బచ్చన్ పాండే మూవీ మాత్రం రిలీజ్ కోసం నానా తంటాలూ పడింది.
2020 క్రిస్మస్కి విడుదలవ్వాల్సిన సినిమా ఇది. 2021 జనవరి 22కి వాయిదా పడింది. సెకెండ్ వేవ్ వల్ల మరోసారి ఆగింది. దాంతో ఇక ఓటీటీ రిలీజ్కి ఫిక్సయ్యారనే వార్తలు వచ్చాయి. అది నిజం కాదని ఇప్పుడు తేలింది. బచ్చన్ పాండే చిత్రాన్ని వచ్చే మార్చ్ 18న థియేటర్స్లో విడుదల చేయనున్నట్టు ప్రకటన వచ్చింది.
ఫర్హాద్ సామ్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సిద్ధార్థ్, బాబీ సింహా నటించిన తమిళ సూపర్ హిట్ ‘జిగర్తాండ’కి రీమేక్. కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు. అర్షద్ వార్శి, పంకజ్ త్రిపాఠి, ప్రతీక్ బబ్బర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు కానీ థర్డ్ వేవ్ అంతకంతకూ టెన్షన్ పెడుతోంది కాబట్టి మార్చ్లో మూవీ రిలీజవుతుందో లేక మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి.
పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్…
శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…