ఫిలిం ఇండస్ట్రీలో సినిమా సినిమాకు జాతకాలు మారిపోతుంటాయి. ఒక సినిమా హిట్టయితే దర్శకుడికి మంచి మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. ఫ్లాప్ అయితే అందరూ పక్కకు జరిగిపోతారు. ఇలా శుక్రవారం పొద్దున జాతకాలు మారిపోతుంటాయి. ‘మనసుతో’ అనే ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఎ.ఎస్.రవికుమార్ చౌదరిని అప్పట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. కొన్నేళ్ల పాటు కష్టపడి.. చివరికి హీరోగా విజయం కోసం చూస్తున్న గోపీచంద్ను లీడ్ రోల్లో పెట్టి పోకూరి బాబూరావు నిర్మాణంలో ‘యజ్ఞం’ తీశాడీ దర్శకుడు.
ఆ సినిమా సెన్సేషనల్ హిట్టవడంతో అతడికి డిమాండ్ పెరిగిపోయింది. నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ స్టార్తో ‘వీరభద్ర’ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ ఛాన్స్ను అతను ఉపయోగించుకోలేకపోయాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో లాంటి సినిమాలు తీసినా ప్రయోజనం లేకపోయింది. ఒక దశలో ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయినట్లే కనిపించాడు రవికుమార్ చౌదరి. అందరూ అతణ్ని మరిచిపోయిన స్థితిలో ‘రేయ్’ సినిమాతో స్ట్రగుల్లో ఉన్న సాయిదరమ్ తేజ్ను హీరోగా పెట్టి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ తీశాడు.
ఆ సినిమా సూపర్ హిట్టయి మళ్లీ రవికుమార్కు డిమాండ్ ఏర్పడేలా చేసింది. ఈసారి అతడి మీద అంచనాలు పెరిగిపోయాయి. భవ్య క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లో గోపీచంద్ హీరోగా పెద్ద బడ్జెట్లో ‘సౌఖ్యం’ తీశాడు. మళ్లీ కథ షరామామూలే. సినిమా డిజాస్టర్ అయింది. రవికుమార్కు మళ్లీ డిమాండ్ పడిపోయింది. ఐదారేళ్లుగా అడ్రస్ లేడు రవికుమార్.
ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత అతడి కొత్త సినిమా అనౌన్స్ అయింది. అందులో హీరో సప్తగిరి కావడం గమనార్హం. కమెడియన్గా ఛాన్సులు వదులుకుని హీరో వేషాల వెంట పడి తన కెరీర్ను ఎటూ కాకుండా చేసుకున్నాడు సప్తగిరి. హీరోగా అతడికి ఏమాత్రం మార్కెట్ లేదు. ఇలాంటి హీరోతో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది రవికుమార్కు. బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసిన దర్శకుడికి ఇప్పుడు సప్తగిరితో సినిమా తీయాల్సిన స్థితి రావడం ఇబ్బందికరమే కదా.
This post was last modified on January 19, 2022 4:43 am
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి కొత్త దర్శకుడికీ ఓ కల. ఒక తరాన్ని ఊపు…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజనరీ నేతే. ఈ విషయాన్ని వైరి వర్గాలు ఎంత విమర్శించినా.. ఆ…
ఒకప్పుడు అపరిచితుడు టైంలో విక్రమ్ సినిమాల ఓపెనింగ్స్ కి ట్రేడ్ మతులు పోయేవి. తర్వాత వచ్చే వాటికి డిమాండ్ పెరిగి…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. 2.0పై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జగన్ 2.0 చాలా భి…
వైసీపీ తరఫున గత ప్రభుత్వంలో ఉండి.. పార్టీని, అప్పటి సీఎం జగన్ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేసమయంలో అప్పటి…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ…