తమిళ నటుడు ధనుష్ కెరీర్ ఆరంభం నుంచే అదిరిపోయే క్యారెక్టర్లతో తనేంటో చాటి చెప్పినా అతడి స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి పరోక్షంగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడం ఒక కారణమైంది. అసలు ఇతర భాషల వాళ్లు ముందుగా అతణ్ని గుర్తించింది రజినీ అల్లుడిగానే. కొన్నేళ్ల ముందు వరకు కూడా అతడి గురించి ప్రస్తావించే ముందు రజినీ అల్లుడు అనే అనేవాళ్లు.
రజినీ ఫ్యాన్స్ ధనుష్ను ఓన్ చేసుకుని.. అతడి ఇమేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంలో కీలక పాత్ర పోషించారు. కోలీవుడ్లో ధనుష్ వెయిట్ పెరగడానికి కచ్చితంగా రజినీ అల్లుడు కావడం ఒక కారణం అనడంలో సందేహం లేదు. ఇప్పుడు రజినీ కూతురు ఐశ్వర్య నుంచి ధనుష్ విడాకులు తీసుకున్న నేపథ్యంలో రజినీ బ్యాకప్ను ధనుష్ కోల్పోతున్నాడే.. ఇది అతడి కెరీర్కు ఇబ్బంది కదా అనే చర్చ నడుస్తోంది ధనుష్.ఐతే గత కొన్నేళ్లలో ధనుష్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అతడి స్థాయి పెరిగిపోయింది.
తన పరిధిని అతను కోలీవుడ్ను దాటి ఎక్కడికో విస్తరించాడు. ఇంకా చెప్పాలంటే రజినీని మించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు. ఆల్రెడీ ‘ఫకీర్’ అనే ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్న ధనుష్.. గత ఏడాది నెట్ ఫ్లిక్స్ కోసం ఒక ఇంటర్నేషనల్ సిరీస్లో ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు, ఆర్టిస్టులతో కలిసి పని చేస్తున్నాడు. రాన్జానా, అత్రంగిరే లాంటి సినిమాలతో బాలీవుడ్లో అతడి ఇమేజ్ పెరిగిపోయింది.
తెలుగులోనూ ధనుష్కు మంచి ఆదరణే ఉంది. ‘సార్’ సినిమాతో నేరుగా తెలుగు సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. మరోవైపు రజినీ సంగతి చూస్తే గత కొన్నేళ్లలో ఆయన ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి. ఆయన సినిమా కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమాల పరంగా రజినీ సపోర్ట్ ధనుష్కు ఎంతమాత్రం అవసరం లేదు. ఐశ్వర్యతో అతడికి ఏం ఇబ్బందులొచ్చాయో ఏమో కానీ.. విడాకుల నిర్ణయం తీసుకోకుండా ఆపడానికి రజినీ అల్లుడిగా వచ్చే హోదా కారణం కాలేకపోయింది.
This post was last modified on January 18, 2022 8:00 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…