Movie News

ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆమెకే ఫిక్సయ్యారు

బాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆలియా భట్.. ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్’తో టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈలోపు ఆలియా మరో తెలుగు మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్, కొరటాల శివల మూవీ.      ఆలియాకి బాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ తెలుగునాట కూడా తనకి బోలెడంత ఫాలోయింగ్ ఉందని ఇప్పుడు ప్రూవ్ అవుతోంది.

అది ఆమెకి బేసిగ్గానే ఉన్న క్రేజా లేక ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ కారణంగా ఏర్పడిందా అనేది తెలీదు కానీ.. ఎన్టీఆర్ నెక్స్ట్‌ సినిమాలో హీరోయిన్‌ ఆమేనని నందమూరి అభిమానులంతా ఫిక్సయ్యారు. ఆమే కావాలని కోరుకుంటున్నారు కూడా. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. అందుకే ఈ కాంబోలో సినిమా అనగానే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

తారక్‌ ఆర్‌‌ఆర్ఆర్‌‌తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ కాస్త ఆలస్యమయ్యింది. అతి త్వరలో గ్రాండ్‌గా లాంచ్ చేసి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. దాంతో హీరోయిన్‌ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి మొదట జాన్వీ కపూర్ పేరు వినిపించింది. తర్వాత అది పుకారని తేలింది. ఆపైన కియారా అద్వానీ ఖరారయ్యిందన్నారు.

కానీ ఆమె రామ్‌చరణ్‌తో కమిటయ్యింది. చివరికి లిస్టు ఆలియా దగ్గరకు వచ్చింది ఆగింది. దాంతో ఈ మూవీకి మరింత హైప్‌ వచ్చిందనే చెప్పాలి. ఆలియా చాలా టాలెంటెడ్. గ్లామర్‌‌కీ తక్కువ లేదు. అందుకే ఆమె తమ ఫేవరేట్ హీరోతో జోడీ కట్టాలని నందమూరి ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి నిజంగానే కొరటాల ఆమెని ఫిక్స్ చేశాడో లేక అభిమానుల ఆశ తీర్చడానికైనా ఆమెను తీసుకుంటాడో చూడాలి. 

This post was last modified on January 17, 2022 2:40 pm

Share

Recent Posts

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

34 minutes ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

49 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

1 hour ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

1 hour ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

3 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

4 hours ago