బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆలియా భట్.. ‘ఆర్ఆర్ఆర్’తో టాలీవుడ్లో అడుగు పెడుతోంది. కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈలోపు ఆలియా మరో తెలుగు మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్, కొరటాల శివల మూవీ. ఆలియాకి బాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ తెలుగునాట కూడా తనకి బోలెడంత ఫాలోయింగ్ ఉందని ఇప్పుడు ప్రూవ్ అవుతోంది.
అది ఆమెకి బేసిగ్గానే ఉన్న క్రేజా లేక ఆర్ఆర్ఆర్ కారణంగా ఏర్పడిందా అనేది తెలీదు కానీ.. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఆమేనని నందమూరి అభిమానులంతా ఫిక్సయ్యారు. ఆమే కావాలని కోరుకుంటున్నారు కూడా. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. అందుకే ఈ కాంబోలో సినిమా అనగానే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
తారక్ ఆర్ఆర్ఆర్తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ కాస్త ఆలస్యమయ్యింది. అతి త్వరలో గ్రాండ్గా లాంచ్ చేసి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. దాంతో హీరోయిన్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి మొదట జాన్వీ కపూర్ పేరు వినిపించింది. తర్వాత అది పుకారని తేలింది. ఆపైన కియారా అద్వానీ ఖరారయ్యిందన్నారు.
కానీ ఆమె రామ్చరణ్తో కమిటయ్యింది. చివరికి లిస్టు ఆలియా దగ్గరకు వచ్చింది ఆగింది. దాంతో ఈ మూవీకి మరింత హైప్ వచ్చిందనే చెప్పాలి. ఆలియా చాలా టాలెంటెడ్. గ్లామర్కీ తక్కువ లేదు. అందుకే ఆమె తమ ఫేవరేట్ హీరోతో జోడీ కట్టాలని నందమూరి ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి నిజంగానే కొరటాల ఆమెని ఫిక్స్ చేశాడో లేక అభిమానుల ఆశ తీర్చడానికైనా ఆమెను తీసుకుంటాడో చూడాలి.
This post was last modified on January 17, 2022 2:40 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…