జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు మామూలు ఫ్రస్టేషన్లో లేరు. ఎప్పుడో 2018 అక్టోబర్లో రిలీజైంది అతడి చివరి సినిమా ‘అరవింద సమేత’. దీని తర్వాత రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’లో పడిపోయాడతను. జక్కన్నతో సినిమా అంటే ఆషామాషీ కాదని అందరికీ తెలుసు. 2020లోనే ఈ సినిమా రిలీజవుతుందని జక్కన్న ఆరంభంలో నొక్కి వక్కాణించినప్పటికీ.. ఎవరికీ ఆ విషయంలో నమ్మకాల్లేవు. బేసిగ్గా రాజమౌళి సినిమాలంటేనే ఆలస్యం.
దీనికి తోడు కరోనా కూడా వెంటాడటంతో ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా ఆలస్యం జరిగి 2022 జనవరిలో కూడా రిలీజ్ కాలేదు. ఎప్పుడు విడుదలవుతుందో స్పష్టత కూడా లేదు. దీని వల్ల తారక్ కొత్త సినిమాల విషయంలోనూ ఆలస్యం జరిగింది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈపాటికే కొరటాల శివతో సినిమా మొదలై షూటింగ్ జరుగుతుండాలి.
కానీ ఇటు ఆర్ఆర్ఆర్, అటు ఆచార్య ఆలస్యం కావడంతో ఆ సినిమా కూడా లేటైంది. ‘ఆచార్య’ ఏప్రిల్ 1కి వాయిదా పడ్డ నేపథ్యంలో కొరటాల శివతో తారక్ మూవీ వేసవిలో కానీ మొదలయ్యేలా లేదు. ఐతే ఈలోపు ప్రి ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయడానికి చూస్తున్నాడు కొరటాల. ఈ సినిమాకు కథ దాదాపుగా రెడీ అయిపోయిందని.. ఇదొక రివెంజ్ డ్రామా నేపథ్యంలో నడిచే సినిమా అని యూనిట్ వర్గాల సమాచారం. ఎమోషన్లు, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయట.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ కన్ఫమ్ అయ్యాడని.. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవుతాయని తెలిసింది. ఇంకా కథానాయిక విషయంలో మాత్రం ఒక క్లారిటీ రాలేదట. త్వరలోనే హీరోయిన్తో పాటు ముఖ్య పాత్రలకు నటీనటులు ఖరారవుతారని సమాచారం. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్తో కలిసి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా వేసవిలో సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…