1 నేనొక్కడినే.. సుకుమార్ కెరీర్లో అత్యంత చేదు అనుభవం అంటే ఈ చిత్రమే. ఇప్పుడు ఆ సినిమాను క్లాసిక్ అని, కల్ట్ మూవీ అని ఎంత పొగిడినా..అప్పుడు అది బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గానే నిలిచింది. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ సుక్కును నమ్మి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేకపోయాడంటూ సుకుమార్ను అందరూ విమర్శించారప్పుడు. తన కెరీర్లో అతి పెద్ద రిగ్రెట్ మహేష్కు సరైన విజయాన్నివ్వలేకపోవడమే అంటూ సుకుమార్ అప్పుడప్పుడూ చెబుతుంటాడు.
ఈ బాకీ తీర్చడానికి మహేష్తో మరో సినిమా అనుకున్నారు కానీ.. అదెందుకో వర్కవుట్ కాలేదు. ఈ సంగతలా ఉంచిత.. 1 నేనొక్కడినే మూవీ తనకు మరో రకంగా మధురానుభూతిని మిగిల్చిందంటున్నాడు సుక్కు. సంక్రాంతి పండుగతో తనకున్న అనుభవాలు, అనుభూతులను గుర్తు చేసుకుంటూ సుకుమార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
అందులో భాగంగా సంక్రాంతితో ముడిపెడుతూ ‘1 నేనొక్కడినే’ తనకెలా ప్రత్యేకమో వివరించారు సుక్కు.‘‘సంక్రాంతి నాకు చాలా ఇష్టమైన పండుగ. చిన్నతనంలో ఎన్నో గొప్ప అనుభవాలున్నాయి ఆ పండుగతో. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక నాకు సంక్రాంతిని ఎంజాయ్ చేసే సమయమే దొరకలేదు. సాధారణంగా నా సినిమాలు వేసవిలో రిలీజవుతుంటాయి. అప్పుడు సినిమా రెడీ చేయాలంటే జనవరిలో ఊపిరి సలపనంత పని ఉంటుంది. పండుగ రోజుల్లో షూటింగ్ లేకపోయినా..ఏదో టెన్షన్ మైండ్ నిండా ఉంటుంది.
సినిమాకు సంబంధించిన విషయాలే నన్ను వెంటాడుతుంటాయి. అవి నన్ను కుదురుగా ఉండనివ్వవు. అందుకే దర్శకుడిని అయ్యాక సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయడం అరుదు. కానీ 2012లో మాత్రం ‘1 నేనొక్కడినే’ కథ మొత్తం పూర్తి చేసి సినిమా ఓకే చేయించుకున్నా. షూటింగ్కు ఇంకా చాలా టైం ఉంది. మెదడులో ఎలాంటి టాస్కుల్లేవు. హాయిగా ప్రశాంతంగా ఉన్నా. ఊరికెళ్లి సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశా’’ అని సుకుమార్ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on January 16, 2022 7:26 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…