1 నేనొక్కడినే.. సుకుమార్ కెరీర్లో అత్యంత చేదు అనుభవం అంటే ఈ చిత్రమే. ఇప్పుడు ఆ సినిమాను క్లాసిక్ అని, కల్ట్ మూవీ అని ఎంత పొగిడినా..అప్పుడు అది బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గానే నిలిచింది. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ సుక్కును నమ్మి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేకపోయాడంటూ సుకుమార్ను అందరూ విమర్శించారప్పుడు. తన కెరీర్లో అతి పెద్ద రిగ్రెట్ మహేష్కు సరైన విజయాన్నివ్వలేకపోవడమే అంటూ సుకుమార్ అప్పుడప్పుడూ చెబుతుంటాడు.
ఈ బాకీ తీర్చడానికి మహేష్తో మరో సినిమా అనుకున్నారు కానీ.. అదెందుకో వర్కవుట్ కాలేదు. ఈ సంగతలా ఉంచిత.. 1 నేనొక్కడినే మూవీ తనకు మరో రకంగా మధురానుభూతిని మిగిల్చిందంటున్నాడు సుక్కు. సంక్రాంతి పండుగతో తనకున్న అనుభవాలు, అనుభూతులను గుర్తు చేసుకుంటూ సుకుమార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
అందులో భాగంగా సంక్రాంతితో ముడిపెడుతూ ‘1 నేనొక్కడినే’ తనకెలా ప్రత్యేకమో వివరించారు సుక్కు.‘‘సంక్రాంతి నాకు చాలా ఇష్టమైన పండుగ. చిన్నతనంలో ఎన్నో గొప్ప అనుభవాలున్నాయి ఆ పండుగతో. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక నాకు సంక్రాంతిని ఎంజాయ్ చేసే సమయమే దొరకలేదు. సాధారణంగా నా సినిమాలు వేసవిలో రిలీజవుతుంటాయి. అప్పుడు సినిమా రెడీ చేయాలంటే జనవరిలో ఊపిరి సలపనంత పని ఉంటుంది. పండుగ రోజుల్లో షూటింగ్ లేకపోయినా..ఏదో టెన్షన్ మైండ్ నిండా ఉంటుంది.
సినిమాకు సంబంధించిన విషయాలే నన్ను వెంటాడుతుంటాయి. అవి నన్ను కుదురుగా ఉండనివ్వవు. అందుకే దర్శకుడిని అయ్యాక సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయడం అరుదు. కానీ 2012లో మాత్రం ‘1 నేనొక్కడినే’ కథ మొత్తం పూర్తి చేసి సినిమా ఓకే చేయించుకున్నా. షూటింగ్కు ఇంకా చాలా టైం ఉంది. మెదడులో ఎలాంటి టాస్కుల్లేవు. హాయిగా ప్రశాంతంగా ఉన్నా. ఊరికెళ్లి సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశా’’ అని సుకుమార్ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on January 16, 2022 7:26 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…