యావరేజ్, బిలో యావరేజ్ ఇచ్చిన దర్శకులు సైతం.. కామ్గా సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నారు. అలాంటిది ఓ సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హీరోలేక ఖాళీగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ దర్శకుడెవరో కాదు.. మారుతి.
‘ప్రతిరోజూ పండగే’లో ఓ హిట్టు కొట్టాడు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో ఇదే పెద్ద హిట్టు. ఆ సినిమా గతేడాది డిసెంబరులో విడుదలైంది. అంటే.. ఇప్పటికి ఏడు నెలలు గడిచిపోయాయి. అయినా మారుతి తదుపరి సినిమా ఏమిటన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
ముందు రామ్ తో ఓ సినిమా చేద్దామనుకున్నాడు. ఇద్దరి మధ్యా చర్చలు కూడా జరిగాయి. కానీ… కుదర్లేదు. వరుణ్ తేజ్, నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ.. ఇలా ఏ హీరోని చూసినా బిజీ.. బిజీ. వీళ్లెవ్వరూ 2021 వరకూ కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి. పోనీ.. సాయిధరమ్ తోనే మరో సినిమా చేద్దామా? అనుకున్నా, కుదరని పని. ఎందుకంటే తన చేతిలోనే ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ ఒకే హీరోతో సినిమా చేసినా కిక్ ఇవ్వదు.
ఇలా ఎలా చూసినా 2021 లోనూ మారుతి సినిమా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చేతిలో ఉన్న సినిమా చేజారిపోయి, అనూహ్యంగా ఏ హీరో అయినా ఖాళీ అయిపోతే తప్ప.. ఇప్పటికిప్పుడు మారుతి సినిమా ఏదీ పట్టాలెక్కదు. ఈ విషయం తెలిసేనేమో.. మారుతి కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించుకుంటున్నాడు. ఈలోగా ఓ వెబ్ సిరీస్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ‘ఆహా’ కోసం ఓ స్క్రిప్టుని కూడా సిద్ధం చేశాడని టాక్.
This post was last modified on June 11, 2020 8:29 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…