యావరేజ్, బిలో యావరేజ్ ఇచ్చిన దర్శకులు సైతం.. కామ్గా సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నారు. అలాంటిది ఓ సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హీరోలేక ఖాళీగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ దర్శకుడెవరో కాదు.. మారుతి.
‘ప్రతిరోజూ పండగే’లో ఓ హిట్టు కొట్టాడు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో ఇదే పెద్ద హిట్టు. ఆ సినిమా గతేడాది డిసెంబరులో విడుదలైంది. అంటే.. ఇప్పటికి ఏడు నెలలు గడిచిపోయాయి. అయినా మారుతి తదుపరి సినిమా ఏమిటన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
ముందు రామ్ తో ఓ సినిమా చేద్దామనుకున్నాడు. ఇద్దరి మధ్యా చర్చలు కూడా జరిగాయి. కానీ… కుదర్లేదు. వరుణ్ తేజ్, నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ.. ఇలా ఏ హీరోని చూసినా బిజీ.. బిజీ. వీళ్లెవ్వరూ 2021 వరకూ కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి. పోనీ.. సాయిధరమ్ తోనే మరో సినిమా చేద్దామా? అనుకున్నా, కుదరని పని. ఎందుకంటే తన చేతిలోనే ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ ఒకే హీరోతో సినిమా చేసినా కిక్ ఇవ్వదు.
ఇలా ఎలా చూసినా 2021 లోనూ మారుతి సినిమా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చేతిలో ఉన్న సినిమా చేజారిపోయి, అనూహ్యంగా ఏ హీరో అయినా ఖాళీ అయిపోతే తప్ప.. ఇప్పటికిప్పుడు మారుతి సినిమా ఏదీ పట్టాలెక్కదు. ఈ విషయం తెలిసేనేమో.. మారుతి కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించుకుంటున్నాడు. ఈలోగా ఓ వెబ్ సిరీస్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ‘ఆహా’ కోసం ఓ స్క్రిప్టుని కూడా సిద్ధం చేశాడని టాక్.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…