బాలీవుడ్లో రోజుకో అఫైర్ బయటపడుతూ ఉంటుంది. వాటిలో అనఫీషియల్గా తెలిసేవే ఎక్కువ. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్లని చూశాం కదా. పెళ్లి కూడా చేసేసుకున్నారు కానీ అప్పటివరకు కూడా ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న విషయం తమ నోటితో చెప్పలేదు. కియారా అద్వానీ కూడా సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది. అడిగితే ఏవేవో చెప్పుద్ది తప్ప అసలు విషయం మాత్రం ఒప్పుకోదు.
తాను మాత్రం ఆ టైప్ కాదంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పోయినేడు అక్టోబర్లో రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ తమ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ప్రకటించారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి రకుల్కి.
ఇంత పెద్ద సెలెబ్రిటీ అయ్యుండి అంత ఓపెన్గా మీ ప్రేమ గురించి ఎలా చెప్పేశారు అని అడిగితే నవ్వేసింది రకుల్. ‘ఇందులో దాచిపెట్టడానికి ఏముందసలు! రహస్యంగా దాక్కుని పరుగులు పెట్టేవారు చాలామంది ఉన్నారు. కానీ మేమిద్దరం ఆ టైప్ కాదు. మాకసలు అలాంటి ఆలోచనలే రావు. ప్రేమలో పడటం తప్పు కాదు. మేం ఒకర్నొకరం గౌరవించుకుంటాం. మా రిలేషన్నీ గౌరవిస్తాం. అందుకే ఓపెన్గా చెప్పేశా’ అని చెప్పింది రకుల్.
ఏం చేసినా పబ్లిక్గా, ట్రాన్స్పరెంట్గానే చేస్తాను తప్ప సీక్రెట్లు మెయింటెయిన్ చేయడం తనకు అలవాటు లేదని తెగేసి చెప్పి మార్కులు కొట్టేసిందామె. ప్రస్తుతం బాలీవుడ్లో చాలా బిజీగా ఉంది రకుల్. ఈ యేడు తను నటించిన నాలుగైదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరికొన్ని లైన్లో ఉన్నాయి. ప్రస్తుతానికి వాటిపైనే దృష్టి పెట్టానని, అవన్నీ ఓ కొలిక్కి వచ్చాక పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని చెబుతోంది.
This post was last modified on January 15, 2022 5:24 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…