ఘాజీ’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం కేవలం తెలుగు వాళ్లనే కాదు.. తమిళ, హిందీ ప్రేక్షకుల్ని కూడా మెస్మరైజ్ చేసింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. జాతీయ అవార్డు కూడా సాధించింది. ఐతే ఈ సినిమా విషయంలో సంకల్ప్కు రావాల్సినంత క్రెడిట్ రాలేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. తొలి ప్రయత్నంలోనే ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడి పేరు మార్మోగిపోయి ఉండాలి.
కానీ సంకల్ప్ మీడియాలో కూడా అంతగా హైలైట్ కాలేదు. దీనికి తోడు అతడి రెండో చిత్రం అంతరిక్షం అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అతడిపై వన్ ఫిలిం వండర్ అనే ముద్ర పడిపోయే ప్రమాదం తలెత్తింది. అంతరిక్షం విడుదలై మూడేళ్లు దాటినా ఇప్పటిదాకా సంకల్ప్ తర్వాతి చిత్రం మొదలే కాలేదు.
మధ్యలో నెట్ ఫ్లిక్స్ వారి ‘పిట్టకథలు’ ఒక సెగ్మెంట్ డైరెక్ట్ చేశాడు సంకల్ప్. దానికి ఏమంత అప్లాజ్ రాలేదు. తర్వాత బాలీవుడ్లో ఏదో సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అది ఒక పట్టాన తెమలలేదు. దీంతో సంకల్ప్ గురించి అంతా మరిచిపోయారు. ఇక ఈ దర్శకుడి కథ ముగిసినట్లే అనుకుంటుండగా.. ఒక క్రేజీ ప్రాజెక్టుతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు సంకల్ప్. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ హీరోగా ‘ఐబీ 91’ అనే హిందీ సినిమాను మొదలుపెట్టాడు సంకల్ప్ రెడ్డి.
ఇది విద్యుత్ సొంత నిర్మాణ సంస్థ యాక్షన్ హీరో ఫిలిమ్స్ బేనర్లో తెరకెక్కనుండటం విశేషం. ఇందులో విద్యుత్ ఇంటెలిజెన్స్ అధికారిగా కనిపించనున్నాడు. తమ ఐడెంటిటీ జనాలకు తెలియకుండా తెర వెనుక ఎన్నో సాహసాలు చేసి, దేశానికి గర్వకారణంగా నిలిచే ఐబీ అధికారుల జీవితాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడట సంకల్ప్. మరి ఈ చిత్రంతో సంకల్ప్ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
This post was last modified on January 14, 2022 12:03 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…