సోగ్గాడే చిన్నినాయనా సినిమా వచ్చినపుడు దానికి సీక్వెల్ ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సీక్వెల్ ప్రపోజల్ నాగార్జున ముందు పెట్టాడు. ఈ సినిమా చేయడానికి నాగ్ ఓకే అన్నాడే కానీ.. ఒక పట్టాన స్క్రిప్టు ఓకే చేయలేదు. మరీ ఆశ్చర్యకరంగా ఈ స్క్రిప్టు మీద మూణ్నాలుగేళ్లు పని చేశాడు కళ్యాణ్.
‘సోగ్గాడే..’ తర్వాత అతను వెంటనే వర్క్ చేసిన స్క్రిప్టు ఇదే. కానీ మధ్యలో రారండోయ్ వేడుక చూద్దాం, నేల టిక్కెట్టు సినిమాలు చేశాడు. మళ్లీ ‘బంగార్రాజు’ మీదే పని చేశాడు. ‘నేల టిక్కెట్టు’ తర్వాత కూడా ఈ సినిమా పట్టాలెక్కడానికి మూడేళ్లకు పైగానే సమయం పట్టింది. ఎట్టకేలకు గత ఏడాది మధ్యలో ఈ స్క్రిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..సినిమాను పట్టాలెక్కించాడు నాగార్జున.
సంక్రాంతి కానుకగా మంచి అంచనాల మధ్య ఈ సినిమా రిలీజవుతోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.ఐతే ‘బంగార్రాజు’కు సీక్వెల్ ఉంటుందా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. దీనికి నాగార్జున సమాధానం చెప్పాడు. బంగార్రాజుది ఎప్పుడైనా, ఏ టైం లైన్లో అయినా వచ్చి సందడి చేయడానికి స్కోప్ ఉన్న పాత్ర అని.. కాబట్టి సోగ్గాడే ఫ్రాంఛైజీలో ఇంకో సినిమా రాదని అనుకోవద్దని ఆయనన్నారు.
బంగార్రాజుకు కూడా సీక్వెల్ చేద్దామని ఆల్రెడీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తనతో అన్నాడని.. కథ నచ్చితే చేద్దామని అన్నానని.. ఐతే ముందు బంగార్రాజు తాము అనుకున్న స్థాయిలో విజయం సాధించాలని నాగ్ పేర్కొన్నాడు. ఐతే ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంత పెద్ద హిట్ అయినా సరే.. ‘బంగార్రాజు’ స్క్రిప్టును ఒక పట్టాన ఓకే చేయలేదు నాగ్. ఒక రకంగా కళ్యాణ్ ఈ సినిమా విషయంలో టార్చర్ అనుభవించాడని సన్నిహితులు అంటుంటారు. మరి ‘బంగార్రాజు’కు అన్నేళ్లు వెయిట్ చేయంచిన నాగ్.. దీని సీక్వెల్ అంటే ఇంకెన్నేళ్లు కళ్యాణ్ నిరీక్షించేలా చేస్తాడో?
This post was last modified on January 14, 2022 11:57 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…