సోగ్గాడే చిన్నినాయనా సినిమా వచ్చినపుడు దానికి సీక్వెల్ ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సీక్వెల్ ప్రపోజల్ నాగార్జున ముందు పెట్టాడు. ఈ సినిమా చేయడానికి నాగ్ ఓకే అన్నాడే కానీ.. ఒక పట్టాన స్క్రిప్టు ఓకే చేయలేదు. మరీ ఆశ్చర్యకరంగా ఈ స్క్రిప్టు మీద మూణ్నాలుగేళ్లు పని చేశాడు కళ్యాణ్.
‘సోగ్గాడే..’ తర్వాత అతను వెంటనే వర్క్ చేసిన స్క్రిప్టు ఇదే. కానీ మధ్యలో రారండోయ్ వేడుక చూద్దాం, నేల టిక్కెట్టు సినిమాలు చేశాడు. మళ్లీ ‘బంగార్రాజు’ మీదే పని చేశాడు. ‘నేల టిక్కెట్టు’ తర్వాత కూడా ఈ సినిమా పట్టాలెక్కడానికి మూడేళ్లకు పైగానే సమయం పట్టింది. ఎట్టకేలకు గత ఏడాది మధ్యలో ఈ స్క్రిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..సినిమాను పట్టాలెక్కించాడు నాగార్జున.
సంక్రాంతి కానుకగా మంచి అంచనాల మధ్య ఈ సినిమా రిలీజవుతోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.ఐతే ‘బంగార్రాజు’కు సీక్వెల్ ఉంటుందా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. దీనికి నాగార్జున సమాధానం చెప్పాడు. బంగార్రాజుది ఎప్పుడైనా, ఏ టైం లైన్లో అయినా వచ్చి సందడి చేయడానికి స్కోప్ ఉన్న పాత్ర అని.. కాబట్టి సోగ్గాడే ఫ్రాంఛైజీలో ఇంకో సినిమా రాదని అనుకోవద్దని ఆయనన్నారు.
బంగార్రాజుకు కూడా సీక్వెల్ చేద్దామని ఆల్రెడీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తనతో అన్నాడని.. కథ నచ్చితే చేద్దామని అన్నానని.. ఐతే ముందు బంగార్రాజు తాము అనుకున్న స్థాయిలో విజయం సాధించాలని నాగ్ పేర్కొన్నాడు. ఐతే ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంత పెద్ద హిట్ అయినా సరే.. ‘బంగార్రాజు’ స్క్రిప్టును ఒక పట్టాన ఓకే చేయలేదు నాగ్. ఒక రకంగా కళ్యాణ్ ఈ సినిమా విషయంలో టార్చర్ అనుభవించాడని సన్నిహితులు అంటుంటారు. మరి ‘బంగార్రాజు’కు అన్నేళ్లు వెయిట్ చేయంచిన నాగ్.. దీని సీక్వెల్ అంటే ఇంకెన్నేళ్లు కళ్యాణ్ నిరీక్షించేలా చేస్తాడో?
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…