ఈ మధ్య కాలంలో తెలుగులో సంచలన విజయం అంటే ‘అఖండ’దే. ‘రూలర్’ లాంటి డిజాస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సాగించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదేమీ రికార్డులు తిరగరాసిన సినిమా కాదు కానీ.. దాని స్థాయిలో అది అసాధారణంగా ఆడేసింది.
ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా అయినా రెండో వీకెండ్ తర్వాత చేతులెత్తేస్తున్న ఈ రోజుల్లో నెల రోజుల తర్వాత కూడా దీనికి హౌస్ ఫుల్స్ పడటం.. ఇంకా దాని థియేట్రికల్ రన్ కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ చిత్రంతో బాలయ్య తొలిసారి వంద కోట్ల గ్రాస్ మార్కును దాటేశాడు. బోయపాటి శ్రీనుతో బాలయ్య కాంబినేషన్కు ఉన్న పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.
దీంతో బాలయ్య మళ్లీ మళ్లీ బోయపాటితో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ‘అఖండ’కు సీక్వెల్ తీస్తే బాగుంటుందన్న కోరిక కూడా వారిలో బలంగా ఉంది.ఇదే విషయాన్ని బోయపాటి శ్రీను దగ్గర ప్రస్తావిస్తే.. ఆయనేమీ ఈ విషయాన్ని కొట్టి పారేయలేదు. ‘అఖండ’కు కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని నొక్కి వక్కాణించాడు బోయపాటి. ఐతే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేనని మాత్రం బోయపాటి అన్నాడు. ‘అఖండ’కు సీక్వెల్ తీయడానికి కావాల్సిన ట్రిగ్గర్ పాయింట్ అందులో ఉందని.. అదేంటో ఇప్పుడే చెప్పనని బోయపాటి తెలిపాడు.
కచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నామని.. అన్నీ కుదిరినపుడ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పాడు. బోయపాటి ఏదో యధాలాపంగా ఈ మాట అన్నట్లుగా లేదు. నిజంగానే ‘అఖండ-2’ చేసేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి.. అల్లు అర్జున్తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలయ్య, బన్నీ చాలా సన్నిహితంగా కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్లిద్దరితో కలిసి మల్టీస్టారర్ చేసే ఉద్దేశాలేమైనా ఉన్నాయా అని బోెయపాటిని అడిగితే.. ‘‘ప్రయత్నిద్దాం. ఏదీ జరగదని అనుకోవద్దు. ఏది ఎలా జరగాలో కాలమే నిర్ణయిస్తుంది’’ అంటూ నర్మగర్భంగా సమాధానం చెప్పాడు బోయపాటి.
This post was last modified on January 13, 2022 9:21 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…