ఒక స్టార్ హీరో, ఆయన కొడుకు కలిసి సినిమా చేస్తే ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుంది. ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏఎన్నార్-నాగార్జున, కృష్ణ-మహేష్ బాబు, మోహన్ బాబు-మంచు విష్ణు, నాగార్జున-నాగచైతన్య.. ఇలా ఈ వరుసలో చాలామంది తండ్రీ కొడుకుల జోడీలను చూశాం. త్వరలోనే చిరంజీవి-చరణ్లను పూర్తి స్థాయి పాత్రల్లో చూడబోతున్నాం. ఐతే హీరో-కొడుకు కలిసి కనిపించినట్లు హీరో-కూతురు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అరుదు.
అసలు హీరోల కూతుళ్లు సినిమాల్లోకి రావడమే తక్కువ. వచ్చినా తండ్రితో కలిసి నటించిన సందర్భాలు పెద్దగా కనిపించవు. ఐతే తెలుగు తెరపై ఈ అరుదైన కలయికను త్వరలోనే చూడబోతున్నాం. సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన పెద్ద కూతురు శివాని కలిసి కనిపించబోతున్నారు ఓ సినిమాలో. ఆ చిత్రమే.. శేఖర్. మలయాళ హిట్ ‘జోసెఫ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్కు తనయురాలిగా కీలక పాత్రలో కనిపించబోతోంది శివాని.
ముందు ఈ పాత్రకు వేరే అమ్మాయిని అనుకున్నారట. కానీ తర్వాత శివానితోనే ఈ సినిమా చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు రాజశేఖర్ భార్య జీవితనే కావడం విశేషం. ముందు లలిత్ అనే యువ దర్శకుడిని పెట్టుకున్నారు కానీ.. తర్వాత సినిమాను జీవితనే టేకప్ చేశారు. ఇలా ఓ మహిళా దర్శకురాలు.. భర్త, కూతురిని కలిపి డైరెక్ట్ చేయబోతుండటం విశేషమే.
సినిమాలో ఈ అమ్మాయి పాత్ర నిడివి తక్కువే కానీ.. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అదేంటన్నది తెరమీదే చూడాలి. ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మలయాంలో ఈ పాత్రను జోజు జార్జ్ చేశాడు. ఆయన నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘శేఖర్’ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఆ రోజు రావాల్సిన ‘ఆచార్య’ వాయిదా పడినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 11, 2022 5:21 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…