ఒక స్టార్ హీరో, ఆయన కొడుకు కలిసి సినిమా చేస్తే ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుంది. ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏఎన్నార్-నాగార్జున, కృష్ణ-మహేష్ బాబు, మోహన్ బాబు-మంచు విష్ణు, నాగార్జున-నాగచైతన్య.. ఇలా ఈ వరుసలో చాలామంది తండ్రీ కొడుకుల జోడీలను చూశాం. త్వరలోనే చిరంజీవి-చరణ్లను పూర్తి స్థాయి పాత్రల్లో చూడబోతున్నాం. ఐతే హీరో-కొడుకు కలిసి కనిపించినట్లు హీరో-కూతురు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అరుదు.
అసలు హీరోల కూతుళ్లు సినిమాల్లోకి రావడమే తక్కువ. వచ్చినా తండ్రితో కలిసి నటించిన సందర్భాలు పెద్దగా కనిపించవు. ఐతే తెలుగు తెరపై ఈ అరుదైన కలయికను త్వరలోనే చూడబోతున్నాం. సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన పెద్ద కూతురు శివాని కలిసి కనిపించబోతున్నారు ఓ సినిమాలో. ఆ చిత్రమే.. శేఖర్. మలయాళ హిట్ ‘జోసెఫ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్కు తనయురాలిగా కీలక పాత్రలో కనిపించబోతోంది శివాని.
ముందు ఈ పాత్రకు వేరే అమ్మాయిని అనుకున్నారట. కానీ తర్వాత శివానితోనే ఈ సినిమా చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు రాజశేఖర్ భార్య జీవితనే కావడం విశేషం. ముందు లలిత్ అనే యువ దర్శకుడిని పెట్టుకున్నారు కానీ.. తర్వాత సినిమాను జీవితనే టేకప్ చేశారు. ఇలా ఓ మహిళా దర్శకురాలు.. భర్త, కూతురిని కలిపి డైరెక్ట్ చేయబోతుండటం విశేషమే.
సినిమాలో ఈ అమ్మాయి పాత్ర నిడివి తక్కువే కానీ.. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అదేంటన్నది తెరమీదే చూడాలి. ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మలయాంలో ఈ పాత్రను జోజు జార్జ్ చేశాడు. ఆయన నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘శేఖర్’ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఆ రోజు రావాల్సిన ‘ఆచార్య’ వాయిదా పడినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 11, 2022 5:21 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…