ఒక స్టార్ హీరో, ఆయన కొడుకు కలిసి సినిమా చేస్తే ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుంది. ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏఎన్నార్-నాగార్జున, కృష్ణ-మహేష్ బాబు, మోహన్ బాబు-మంచు విష్ణు, నాగార్జున-నాగచైతన్య.. ఇలా ఈ వరుసలో చాలామంది తండ్రీ కొడుకుల జోడీలను చూశాం. త్వరలోనే చిరంజీవి-చరణ్లను పూర్తి స్థాయి పాత్రల్లో చూడబోతున్నాం. ఐతే హీరో-కొడుకు కలిసి కనిపించినట్లు హీరో-కూతురు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అరుదు.
అసలు హీరోల కూతుళ్లు సినిమాల్లోకి రావడమే తక్కువ. వచ్చినా తండ్రితో కలిసి నటించిన సందర్భాలు పెద్దగా కనిపించవు. ఐతే తెలుగు తెరపై ఈ అరుదైన కలయికను త్వరలోనే చూడబోతున్నాం. సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన పెద్ద కూతురు శివాని కలిసి కనిపించబోతున్నారు ఓ సినిమాలో. ఆ చిత్రమే.. శేఖర్. మలయాళ హిట్ ‘జోసెఫ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్కు తనయురాలిగా కీలక పాత్రలో కనిపించబోతోంది శివాని.
ముందు ఈ పాత్రకు వేరే అమ్మాయిని అనుకున్నారట. కానీ తర్వాత శివానితోనే ఈ సినిమా చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు రాజశేఖర్ భార్య జీవితనే కావడం విశేషం. ముందు లలిత్ అనే యువ దర్శకుడిని పెట్టుకున్నారు కానీ.. తర్వాత సినిమాను జీవితనే టేకప్ చేశారు. ఇలా ఓ మహిళా దర్శకురాలు.. భర్త, కూతురిని కలిపి డైరెక్ట్ చేయబోతుండటం విశేషమే.
సినిమాలో ఈ అమ్మాయి పాత్ర నిడివి తక్కువే కానీ.. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అదేంటన్నది తెరమీదే చూడాలి. ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మలయాంలో ఈ పాత్రను జోజు జార్జ్ చేశాడు. ఆయన నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘శేఖర్’ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఆ రోజు రావాల్సిన ‘ఆచార్య’ వాయిదా పడినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 11, 2022 5:21 pm
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…