ఒక స్టార్ హీరో, ఆయన కొడుకు కలిసి సినిమా చేస్తే ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుంది. ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏఎన్నార్-నాగార్జున, కృష్ణ-మహేష్ బాబు, మోహన్ బాబు-మంచు విష్ణు, నాగార్జున-నాగచైతన్య.. ఇలా ఈ వరుసలో చాలామంది తండ్రీ కొడుకుల జోడీలను చూశాం. త్వరలోనే చిరంజీవి-చరణ్లను పూర్తి స్థాయి పాత్రల్లో చూడబోతున్నాం. ఐతే హీరో-కొడుకు కలిసి కనిపించినట్లు హీరో-కూతురు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అరుదు.
అసలు హీరోల కూతుళ్లు సినిమాల్లోకి రావడమే తక్కువ. వచ్చినా తండ్రితో కలిసి నటించిన సందర్భాలు పెద్దగా కనిపించవు. ఐతే తెలుగు తెరపై ఈ అరుదైన కలయికను త్వరలోనే చూడబోతున్నాం. సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన పెద్ద కూతురు శివాని కలిసి కనిపించబోతున్నారు ఓ సినిమాలో. ఆ చిత్రమే.. శేఖర్. మలయాళ హిట్ ‘జోసెఫ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్కు తనయురాలిగా కీలక పాత్రలో కనిపించబోతోంది శివాని.
ముందు ఈ పాత్రకు వేరే అమ్మాయిని అనుకున్నారట. కానీ తర్వాత శివానితోనే ఈ సినిమా చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు రాజశేఖర్ భార్య జీవితనే కావడం విశేషం. ముందు లలిత్ అనే యువ దర్శకుడిని పెట్టుకున్నారు కానీ.. తర్వాత సినిమాను జీవితనే టేకప్ చేశారు. ఇలా ఓ మహిళా దర్శకురాలు.. భర్త, కూతురిని కలిపి డైరెక్ట్ చేయబోతుండటం విశేషమే.
సినిమాలో ఈ అమ్మాయి పాత్ర నిడివి తక్కువే కానీ.. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అదేంటన్నది తెరమీదే చూడాలి. ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మలయాంలో ఈ పాత్రను జోజు జార్జ్ చేశాడు. ఆయన నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘శేఖర్’ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఆ రోజు రావాల్సిన ‘ఆచార్య’ వాయిదా పడినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 11, 2022 5:21 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…