ప్రభాస్ ప్రస్తుతం లైన్లో పెట్టిన మూణ్నాలుగు భారీ సినిమాల్లో ముందుగా అనౌన్స్ చేసింది ‘ప్రాజెక్ట్-కె’నే. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తన ‘వైజయంతీ మూవీస్’ బేనర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘ప్రాజెక్ట్-కె’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఐతే ప్రకటన చేశాక సినిమా పట్టాలెక్కడానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ప్రి ప్రొడక్షన్ వర్క్ భారీ ఎత్తున చేయాల్సి ఉండటంతో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది.
మధ్యలో ‘రాధేశ్యామ్’తో పాటు ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ను కూడా పూర్తి చేసేశాడు ప్రభాస్. ‘సలార్’ సినిమా కూడా దాదాపు అవగొట్టేశాడు. ఎట్టకేలకు కొన్ని నెలల కిందట ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకుంది. కాస్త వేగంగానే రెండు షెడ్యూళ్లు పూర్తి చేశారు. మూడో షెడ్యూల్ మొదలుపెడదాం అనుకునే సమయానికి కరోనా థర్డ్ వేవ్ వచ్చి పడింది. షూటింగ్ ఆపేశారు. ఈ సినిమా స్కేల్, ప్రభాస్ వేరే కమిట్మెంట్ల దృష్ట్యా ‘ప్రాజెక్ట్-కె’ చాలా ఆలస్యం అవుతుందని.. ఇంకో రెండేళ్లకు కానీ విడుదల కాదేమో అన్న అంచనాతో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
కానీ నిర్మాత అశ్వినీదత్ మాత్రం అంత కాలం ఎదురు చూడాల్సిన పని లేదని అంటున్నాడు. వచ్చే ఏడాది వేసవికే ‘ప్రాజెక్ట్-కె’ను విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆయన వెల్లడించాడు.‘ప్రాజెక్ట్-కె’ షూట్, రిలీజ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం.
ఈ షెడ్యూల్లో అమితాబ్, దీపికా పాల్గొనబోతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే వేసవిలో చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తాం’’ అని ఆయన తెలిపారు. ఐతే ‘రాధేశ్యామ్’ లాంటి మామూలు సినిమానే రెండేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకుని ఇంకా విడుదల కోసం వేచి చూస్తోంది. కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే పోయేలా లేదు కాబట్టి వచ్చే ఏడాది చివరికి ‘ప్రాజెక్ట్-కె’ రిలీజైనా చాలనుకుంటున్నారు అభిమానులు.
This post was last modified on January 11, 2022 3:45 pm
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…