Movie News

ఇన్నాళ్లకు ఓ పవర్ఫుల్ పాత్రలో..

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా ఈమె నటించిన ‘పుష్ప’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ పక్క తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.

త్వరలోనే ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో పాటు ‘గుడ్ బై’ అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తోన్న ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు దీన్ని నిర్మించబోతున్నారు.

ఈ సినిమా కథ మొత్తం రష్మిక చుట్టూనే తిరుగుతుందట. ఈసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాహుల్ అలరించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా 1995వ సంవత్సరంలో జరిగిన కథగా చిత్రీకరించనున్నారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అప్పట్లో భారత దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్న సమయంలో.. ఆర్ధిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టారు. ఇలాంటి నేపధ్యాన్ని దర్శకుడు రాహుల్ తన కథకు జోడించినట్లు తెలుస్తోంది. 

ఒక కిరాణా కొట్టు వాడి కూతురు పెద్ద బిజినెస్ విమెన్ గా ఎలా ఎదిగిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఇందులో రష్మిక పాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో  హీరోయిన్ గా నటించిన రష్మిక.. తొలిసారి లీడ్ రోల్ పోషించనుంది. మరి ఈ సినిమా ఆమెకి ఎలాంటి గుర్తింపుని తీసుకొస్తుందో చూడాలి!

This post was last modified on January 9, 2022 6:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago