తెలుగు తెరపైకి మరో కొత్త హీరో వస్తున్నాడు. అతనే.. గల్లా అశోక్. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త కథానాయకుడితను. ఆయన తనయురాలు పద్మావతి, అల్లుడు గల్లా జయదేవ్ల కొడుకే ఈ అశోక్. కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా ఘన వారసత్వంతోనే అతను హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. కాకపోతే తొలి సినిమా రిలీజ్ ముంగిట అతను కోరుకున్న ప్రమోషనే దక్కట్లేదు.
అశోక్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘హీరో’ మూవీ చాన్నాళ్ల కిందటే పూర్తయింది. కానీ రిలీజ్ విషయంలో సరైన టైమింగ్ కుదరక సినిమాను హోల్డ్ చేసి పెట్టారు. పది రోజుల కిందట ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటంతో హడావుడిగా సంక్రాంతి విడుదలకు సినిమాను సిద్ధం చేశారు. కొత్త హీరో సినిమాకు ఇలా హడావుడిగా రిలీజ్ అంటే బజ్ తీసుకురావడం కష్టమే.
కనీసం నెల రోజుల ముందు నుంచి ఒక పద్ధతి ప్రకారం సినిమాను ప్రమోట్ చేసి, జనాల్లో ఆసక్తిని పెంచాలి.‘హీరో’ విషయంలో అలా ఏమీ జరగలేదు. కనీసం రిలీజ్ ముంగిట అయినా హైప్ పెంచుదామనుకుంటే.. పరిస్థితులు తిరగబడ్డాయి. నిజానికి అశోక్ సినిమాకు హైప్ తీసుకురావడం మహేష్ బాబు చేతుల్లోనే ఉంది. సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ పెట్టి మహేష్ బాబును ముఖ్య అతిథిగా పిలవాలనుకున్నారు. ఆయనే తన మేనల్లుడిని జనాలకు పరిచయం చేసి, అతడి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే బాగుండేది.
కానీ ఈవెంట్ గురించి ప్లాన్ చేస్తున్నపుడే మహేష్ కరోనా బారిన పడ్డాడు. మేనల్లుడి గురించి ఒక బైట్ కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నాడు. మహేష్ మీద ఆశలు వదులుకుని తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కొంచెం ఘనంగా చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు హఠాత్తుగా మరణించారు.
దీంతో కృష్ణ కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. మిగతా ప్రమోషన్లు సైతం పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో సినిమా పెద్దగా ప్రచారం లేకుండానే రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు ముందు నుంచి బజ్ లేకపోగా.. రిలీజ్ ముంగిట పరిణామాలు ప్రతికూలం అయ్యాయి. దీంతో అశోక్ లాంచింగ్ ఏమాత్రం హడావుడి లేకుండా జరగబోతోంది. నిజానికి అశోక్ లాంచింగ్ దిల్ రాజు చేతుల మీదుగా జరగాల్సింది. కొన్ని కారణాలతో అది జరగలేదు. తర్వాత ‘హీరో’ సినిమా చేస్తే దాని విడుదల ముంగిట ఇలా పరిస్థితులు తిరగబడ్డాయి.
This post was last modified on January 9, 2022 5:44 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…