నాగచైతన్య నుంచి విడాకులు పొందినప్పటి నుంచి సమంతను గమనిస్తుంటే.. ఆమె ఫేజ్ దాటడానికి ఇబ్బంది పడుతున్న సంగతి స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. తన సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ పోస్టుల ద్వారా తన స్థితిని ఆమె తెలియజేస్తూనే ఉంది. విడాకులు ఆమె జీవితాన్ని ఒక రకంగా కుదిపేసినట్లే కనిపించింది ఆ పోస్టులు, వివిధ సందర్భాల్లో సమంత స్పందించిన తీరు చూస్తే. తాజాగా మరోసారి సమంత తన బాధను పరోక్షంగా బయటపెట్టింది.
హైదరాబాద్ సిటీలో కొత్తగా మొదలైన ఒక కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది. ఆ సందర్భంగా సమంత.. డిప్రెషన్ వల్ల తలెత్తే దుష్పరిణామాల గురించి, ఆ సమయంలో సన్నిహితుల సహకారం ఎంత అవసరం, అలాగే మానసిక వైద్యుల నుంచి కౌన్సెలింగ్ తీసుకోవడం ఎంత ముఖ్యం అనే విషయాలపై సమంత మాట్లాడింది.వ్యక్తిగత జీవితాల్లో ఒడుదొడుకులు ఎదురైనపుడు లోలోన కుంగిపోకూడదని.. మన చుట్టూ ఉన్న వారి సాయం తీసుకోవాలని సమంత సూచించింది.
తన జీవితంలో కూడా కఠిన దశను ఎదుర్కొన్నానని.. అలాంటపుడు తన సన్నిహితులే తనకు అండగా నిలిచారని ఆమె తెలిపింది. మనం మానసికంగా ఇబ్బంది పడుతున్నపుడు సన్నిహితుల నుంచి సాంత్వన పొందడం చాలా అవసరం అని.. మొహమాట పడకుండా అలాంటి సమయాల్లో దగ్గరి వాళ్లతో మాట్లాడాలని సమంత పేర్కొంది.
అంతే కాక అవసరమైనపుడు మానసిక వైద్యుల సాయం పొందడం కూడా చాలా అవసరమని సమంత పేర్కొంది. మానసిక చికిత్సా కేంద్రాల అవసరం చాలా ఉందని కూడా సమంత అభిప్రాయపడింది. తన వ్యక్తిగత జీవితం గురించి.. డిప్రెషన్ సమస్యల గురించి మాట్లాడుతున్నపుడు సమంత కొంత ఎమోషనల్ అయింది. ఆమె కళ్లల్లో కాస్త నీళ్లు కూడా కనిపించాయి. విడాకుల తర్వాత ఎంత ఇబ్బంది పడ్డప్పటికీ.. త్వరగానే ఈ ఫేజ్ నుంచి బయటపడి సినిమాల్లో బిజీ అవడం ద్వారా కోలుకున్నట్లే కనిపిస్తోంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…