సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో పెద్ద విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల కిందట తన భార్య విజయ నిర్మలను కోల్పోయిన కృష్ణ.. ఇప్పుడు తన పెద్ద కొడుకు రమేష్ బాబును దూరం చేసుకున్నారు. తండ్రి బతికి ఉండగా కొడుకు చనిపోవడం అంటే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పేదేముంది? ఇప్పటికే విజయ నిర్మలను కోల్పోయి ఒక రకంగా కుంగిపోయిన కృష్ణకు ఈ బాధ భరించలేనిదే. రమేష్ బాబు అంటే కృష్ణకు చాలా ఇష్టం. తన పెద్ద కొడుకును హీరోగా నిలబెట్టాలని ఆయన చాలానే కష్టపడ్డారు. సొంత నిర్మాణ సంస్థలో అతణ్ని హీరోగా పరిచయం చేసి వరుసగా సినిమాలు చేయించారు.
అల్లూరి సీతారామరాజు సినిమాలోనే బాల నటుడిగా తెరంగేట్రం చేసిన రమేష్ బాబు.. తర్వాత బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. ఆపై సామ్రాట్ మూవీతో అతను హీరోగా పరిచయం అయ్యాడు. ఆపై బజార్ రౌడీ, బ్లాక్ టైగర్, ముగ్గురు కొడుకులు, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం.. ఇలా చాలా సినిమాలే చేశాడు. కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. కృష్ణ కొడుకు, పైగా బాల నటుడిగా చేశాడు కాబట్టి హీరోగా పరిచయం అయినపుడు కొన్నేళ్లు క్రేజ్ ఉంది కానీ.. సరైన సినిమాలు పడక, ప్రేక్షకులను ఆకట్టుకోలేక వెనుకబడిపోయాడు రమేష్. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు తగ్గిపోయాయి.
పూర్తిగా మార్కెట్ కోల్పోవడంతో సినిమాలు ఆపేయాల్సి వచ్చింది. హీరోగా సక్సెస్ కాలేకపోయిన రమేష్ బాబు.. నిర్మాతగా అయినా నిలదొక్కుకోవాలని చూశారు. హిందీ సూర్యవంశం మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించి.. అర్జున్ లాంటి భారీ చిత్రంతో నిర్మాత అవతారం ఎత్తాడు. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
బాక్సాఫీస్ ఫెయిల్యూర్గా నిలిచింది. ఆ తర్వాత అతిథి లాంటి మరో భారీ చిత్రాన్ని నిర్మిస్తే అది కూడా నిరాశ పరిచింది. దీంతో ఇక సినిమాలు ఆపేశారాయన. దూకుడు, ఆగడు సినిమాలకు ప్రెజెంటర్గా మాత్రం వ్యవహరించారు. దూకుడు బ్లాక్బస్టర్ అయినా.. ఆగడు డిజాస్టర్ అవడంతో పూర్తిగా సినిమాల నుంచి తప్పుకున్నాడు. మొత్తానికి కృష్ణ ఘన వారసత్వం ఉన్నప్పటికీ.. రమేష్ సినీ రంగంలో నిలదొక్కుకోకపోవడం విచారకరమే. కొన్నేళ్లుగా అస్సలు వార్తల్లో లేని ఆయన.. ఇప్పుడిలా మరణ వార్తతో అందరినీ విషాదంలోకి నెట్టారు.
This post was last modified on January 9, 2022 2:44 am
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను సంతృప్తి పరచడం లేదని బాహాటంగానే…