ఈగ సినిమాతో తెలుగులో తనదైన ముద్ర వేశాడు కన్నడ నటుడు సుదీప్. పెర్ఫామెన్స్ పరంగా ఆ సినిమాలో అతనే హైలైట్. సినిమా అంత పెద్ద సక్సెస్ కావడంలో అతడి పాత్ర కీలకం. ఐతే తొలి సినిమాతో అంత పెద్ద బ్రేక్ వచ్చినా.. తెలుగులో కెరీర్ను నిర్మించుకోలేకపోయాడు సుదీప్. యాక్షన్ త్రీడీ, బాహుబలి సినిమాల్లో తన స్థాయికి తగని పాత్రల్లో మెరిసి మాయమయ్యాడు.
అతడికి తగ్గ పాత్రలు తెలుగు దర్శకులు ఇవ్వలేదా.. లేక అతనే ఇక్కడి అవకాశాల్ని కాదనుకున్నాడా అన్నది తెలియదు. గత కొన్నేళ్లలో తెలుగులో మళ్లీ ఏ సినిమా చేయలేదు. ఐతే సుదీప్ తెలుగులోకి మళ్లీ బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నది తాజా సమాచారం. అతను సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే కొత్త సినిమా సర్కారు వారి పాటలో సుదీపే విలన్ పాత్ర నటిస్తాడని ఆసక్తికర ప్రచారం సాగుతోంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే, అందులో ఎంత పెద్ద నటుడు నటిస్తే హీరో, అతడి పాత్ర అంతగా ఎలివేట్ అవుతాయన్న ఉద్దేశంతో సుదీప్ను పరశురామ్ పట్టుకొస్తున్నాడని.. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని.. మహేష్ సినిమా కాబట్టి సుదీప్ ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు.
ఇదే నిజమైతే మహేష్, సుదీప్ కాంబినేషన్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. సంగీత దర్శకుడిగా మాత్రం తమన్ ఓకే అయ్యాడు. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
This post was last modified on June 11, 2020 12:14 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…