టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ సోగ్గాడి సందడికి రంగం సిద్ధమైంది. ఆరేళ్ల కిందట సంక్రాంతి టైంలోనే వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. నాగ్ కెరీర్లోనే అది హైయెస్ట్ గ్రాసర్గా నిలవడం విశేషం. పోటీలో వేరే భారీ చిత్రాలుంటే వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ విన్నర్గా నిలిచిందా చిత్రం. ఆ సినిమాకు హైలైట్గా నిలిచింది బంగార్రాజు పాత్రలో నాగార్జున చేసిన అల్లరి, ఆయన పండించిన రొమాన్సే. తెలుగు తెరపై ఇలాంటి రొమాంటిక్ క్యారెక్టర్ చూసి అప్పటికి చాలా కాలం అయింది.
ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, యువ కథానాయిక లావణ్య త్రిపాఠి నాగ్కు జోడీగా నటించగా.. ఇంకా అనుష్క, అనసూయ తదితరులు క్యామియో రోల్స్లో సందడి చేశారు. వాళ్లందరితో కలిసి నాగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సినిమాకు అదే హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ‘బంగార్రాజు’లోనూ ఇలాంటి సయ్యాటలు చూడబోతున్నాం. ఈసారి నాగ్కు తోడు నాగచైతన్య కూడా అమ్మాయిలతో రొమాన్స్ పండించబోతున్నాడు.
‘బంగార్రాజు’లో నాగ్కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించడం తెలిసిందే. ఇక ‘జాతిరత్నాలు’ భామ ఫరియా అబ్దుల్లా ఒక పాటలో సందడి చేయడమూ విదితమే. ఐతే వీరికి తోడు ఇంకో ఐదుగురు హీరోయిన్లు సినిమాలో సందడి చేయబోతున్నారట. ‘బంగార్రాజు’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ విషయాన్ని వెల్లడించాడు. సినిమాలో ఆరేడుగురు హీరోయిన్లున్నారట నిజమేనా అని విలేకరులు అడిగితే.. మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు కనిపించబోతున్నారని బదులిచ్చాడు. ఐతే వాళ్లెవ్వరన్నది వెల్లడించలేదు.
లడ్డుండా పాటలో కనిపించిన చోటా మోటా హీరోయిన్లను కూడా కలిపి ఎనిమిది మంది అన్నాడా.. లేక వేరే వాళ్లు ఈ సినిమాలో సందడి చేశారా అన్నది తెలియదు. ఇక ఈ చిత్రం నిడివి గురించి అడిగితే 2 గంటల 34 నిమిషాలని కళ్యాణ్ కృష్ణ వెల్లడించాడు. ‘సోగ్గాడే..’లో చిన్న నాగార్జునగా కనిపించిన రాము పాత్ర ఇందులో ఉంటుందా అని రెండు మూడు నిమిషాలు కనిపిస్తుందని తెలిపాడు కళ్యాణ్.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…