టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ సోగ్గాడి సందడికి రంగం సిద్ధమైంది. ఆరేళ్ల కిందట సంక్రాంతి టైంలోనే వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. నాగ్ కెరీర్లోనే అది హైయెస్ట్ గ్రాసర్గా నిలవడం విశేషం. పోటీలో వేరే భారీ చిత్రాలుంటే వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ విన్నర్గా నిలిచిందా చిత్రం. ఆ సినిమాకు హైలైట్గా నిలిచింది బంగార్రాజు పాత్రలో నాగార్జున చేసిన అల్లరి, ఆయన పండించిన రొమాన్సే. తెలుగు తెరపై ఇలాంటి రొమాంటిక్ క్యారెక్టర్ చూసి అప్పటికి చాలా కాలం అయింది.
ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, యువ కథానాయిక లావణ్య త్రిపాఠి నాగ్కు జోడీగా నటించగా.. ఇంకా అనుష్క, అనసూయ తదితరులు క్యామియో రోల్స్లో సందడి చేశారు. వాళ్లందరితో కలిసి నాగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సినిమాకు అదే హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ‘బంగార్రాజు’లోనూ ఇలాంటి సయ్యాటలు చూడబోతున్నాం. ఈసారి నాగ్కు తోడు నాగచైతన్య కూడా అమ్మాయిలతో రొమాన్స్ పండించబోతున్నాడు.
‘బంగార్రాజు’లో నాగ్కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించడం తెలిసిందే. ఇక ‘జాతిరత్నాలు’ భామ ఫరియా అబ్దుల్లా ఒక పాటలో సందడి చేయడమూ విదితమే. ఐతే వీరికి తోడు ఇంకో ఐదుగురు హీరోయిన్లు సినిమాలో సందడి చేయబోతున్నారట. ‘బంగార్రాజు’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ విషయాన్ని వెల్లడించాడు. సినిమాలో ఆరేడుగురు హీరోయిన్లున్నారట నిజమేనా అని విలేకరులు అడిగితే.. మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు కనిపించబోతున్నారని బదులిచ్చాడు. ఐతే వాళ్లెవ్వరన్నది వెల్లడించలేదు.
లడ్డుండా పాటలో కనిపించిన చోటా మోటా హీరోయిన్లను కూడా కలిపి ఎనిమిది మంది అన్నాడా.. లేక వేరే వాళ్లు ఈ సినిమాలో సందడి చేశారా అన్నది తెలియదు. ఇక ఈ చిత్రం నిడివి గురించి అడిగితే 2 గంటల 34 నిమిషాలని కళ్యాణ్ కృష్ణ వెల్లడించాడు. ‘సోగ్గాడే..’లో చిన్న నాగార్జునగా కనిపించిన రాము పాత్ర ఇందులో ఉంటుందా అని రెండు మూడు నిమిషాలు కనిపిస్తుందని తెలిపాడు కళ్యాణ్.
This post was last modified on January 8, 2022 9:22 pm
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…