టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ సోగ్గాడి సందడికి రంగం సిద్ధమైంది. ఆరేళ్ల కిందట సంక్రాంతి టైంలోనే వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. నాగ్ కెరీర్లోనే అది హైయెస్ట్ గ్రాసర్గా నిలవడం విశేషం. పోటీలో వేరే భారీ చిత్రాలుంటే వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ విన్నర్గా నిలిచిందా చిత్రం. ఆ సినిమాకు హైలైట్గా నిలిచింది బంగార్రాజు పాత్రలో నాగార్జున చేసిన అల్లరి, ఆయన పండించిన రొమాన్సే. తెలుగు తెరపై ఇలాంటి రొమాంటిక్ క్యారెక్టర్ చూసి అప్పటికి చాలా కాలం అయింది.
ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, యువ కథానాయిక లావణ్య త్రిపాఠి నాగ్కు జోడీగా నటించగా.. ఇంకా అనుష్క, అనసూయ తదితరులు క్యామియో రోల్స్లో సందడి చేశారు. వాళ్లందరితో కలిసి నాగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సినిమాకు అదే హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ‘బంగార్రాజు’లోనూ ఇలాంటి సయ్యాటలు చూడబోతున్నాం. ఈసారి నాగ్కు తోడు నాగచైతన్య కూడా అమ్మాయిలతో రొమాన్స్ పండించబోతున్నాడు.
‘బంగార్రాజు’లో నాగ్కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించడం తెలిసిందే. ఇక ‘జాతిరత్నాలు’ భామ ఫరియా అబ్దుల్లా ఒక పాటలో సందడి చేయడమూ విదితమే. ఐతే వీరికి తోడు ఇంకో ఐదుగురు హీరోయిన్లు సినిమాలో సందడి చేయబోతున్నారట. ‘బంగార్రాజు’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ విషయాన్ని వెల్లడించాడు. సినిమాలో ఆరేడుగురు హీరోయిన్లున్నారట నిజమేనా అని విలేకరులు అడిగితే.. మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు కనిపించబోతున్నారని బదులిచ్చాడు. ఐతే వాళ్లెవ్వరన్నది వెల్లడించలేదు.
లడ్డుండా పాటలో కనిపించిన చోటా మోటా హీరోయిన్లను కూడా కలిపి ఎనిమిది మంది అన్నాడా.. లేక వేరే వాళ్లు ఈ సినిమాలో సందడి చేశారా అన్నది తెలియదు. ఇక ఈ చిత్రం నిడివి గురించి అడిగితే 2 గంటల 34 నిమిషాలని కళ్యాణ్ కృష్ణ వెల్లడించాడు. ‘సోగ్గాడే..’లో చిన్న నాగార్జునగా కనిపించిన రాము పాత్ర ఇందులో ఉంటుందా అని రెండు మూడు నిమిషాలు కనిపిస్తుందని తెలిపాడు కళ్యాణ్.
This post was last modified on January 8, 2022 9:22 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…