టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ సోగ్గాడి సందడికి రంగం సిద్ధమైంది. ఆరేళ్ల కిందట సంక్రాంతి టైంలోనే వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. నాగ్ కెరీర్లోనే అది హైయెస్ట్ గ్రాసర్గా నిలవడం విశేషం. పోటీలో వేరే భారీ చిత్రాలుంటే వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ విన్నర్గా నిలిచిందా చిత్రం. ఆ సినిమాకు హైలైట్గా నిలిచింది బంగార్రాజు పాత్రలో నాగార్జున చేసిన అల్లరి, ఆయన పండించిన రొమాన్సే. తెలుగు తెరపై ఇలాంటి రొమాంటిక్ క్యారెక్టర్ చూసి అప్పటికి చాలా కాలం అయింది.
ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, యువ కథానాయిక లావణ్య త్రిపాఠి నాగ్కు జోడీగా నటించగా.. ఇంకా అనుష్క, అనసూయ తదితరులు క్యామియో రోల్స్లో సందడి చేశారు. వాళ్లందరితో కలిసి నాగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సినిమాకు అదే హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ‘బంగార్రాజు’లోనూ ఇలాంటి సయ్యాటలు చూడబోతున్నాం. ఈసారి నాగ్కు తోడు నాగచైతన్య కూడా అమ్మాయిలతో రొమాన్స్ పండించబోతున్నాడు.
‘బంగార్రాజు’లో నాగ్కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించడం తెలిసిందే. ఇక ‘జాతిరత్నాలు’ భామ ఫరియా అబ్దుల్లా ఒక పాటలో సందడి చేయడమూ విదితమే. ఐతే వీరికి తోడు ఇంకో ఐదుగురు హీరోయిన్లు సినిమాలో సందడి చేయబోతున్నారట. ‘బంగార్రాజు’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ విషయాన్ని వెల్లడించాడు. సినిమాలో ఆరేడుగురు హీరోయిన్లున్నారట నిజమేనా అని విలేకరులు అడిగితే.. మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు కనిపించబోతున్నారని బదులిచ్చాడు. ఐతే వాళ్లెవ్వరన్నది వెల్లడించలేదు.
లడ్డుండా పాటలో కనిపించిన చోటా మోటా హీరోయిన్లను కూడా కలిపి ఎనిమిది మంది అన్నాడా.. లేక వేరే వాళ్లు ఈ సినిమాలో సందడి చేశారా అన్నది తెలియదు. ఇక ఈ చిత్రం నిడివి గురించి అడిగితే 2 గంటల 34 నిమిషాలని కళ్యాణ్ కృష్ణ వెల్లడించాడు. ‘సోగ్గాడే..’లో చిన్న నాగార్జునగా కనిపించిన రాము పాత్ర ఇందులో ఉంటుందా అని రెండు మూడు నిమిషాలు కనిపిస్తుందని తెలిపాడు కళ్యాణ్.
This post was last modified on January 8, 2022 9:22 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…