మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా తరువాత జోరు పెంచారు. ఓ పక్క తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూనే.. మరో పక్క కొత్త సినిమాలను ఒప్పుకుంటున్నారు. ఇటీవల ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసిన రవితేజ ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాలు సెట్స్ పై ఉండగానే.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే సినిమాలో నటించబోతున్నట్లు చెప్పారు. సంక్రాంతి నాడు ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు రవితేజ. ఇందులో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రవితేజతో పాటు మరో హీరో కూడా కనిపించబోతున్నారు.
అతడు మరెవరో కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్. కథ ప్రకారం సినిమాలో కీలకపాత్ర కోసం విష్ణు విశాల్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ కుర్ర హీరో రానాతో కలిసి ‘అరణ్య’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు మరో తెలుగు ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ కొట్టేశారు. మరి తెరపై రవితేజ-విష్ణు విశాల్ ల సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
ఇక ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. వారు ఫరియా అబ్దుల్లా, ప్రియాంక మోహన్, దక్ష నగర్కార్ అని తెలుస్తోంది. దక్ష నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
This post was last modified on January 8, 2022 7:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…