సంక్రాంతి సీజన్లో సందడి చేయాల్సిన భారీ చిత్రాఉల ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడటంతో బంగార్రాజు మూవీ డ్రైవర్ సీట్లోకి వచ్చింది. ఆ సినిమాకు ట్రేడ్ వర్గాల్లో మాంచి డిమాండ్ ఏర్పడింది. ఉన్నట్లుండి ఈ సినిమా థియేట్రికల్ హక్కుల రేట్లు పెరిగిపోయినట్లు సమాచారం. ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ కావడం, పోటీలో ఈ స్థాయి సినిమా ఏదీ లేకపోవడంతో బయ్యర్లు కూడా ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొనడానికి రెడీ అయ్యారు.
సంక్రాంతి రోజు విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ రోజు రోజుకూ మారిపోతున్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం విడుదల రోజుకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రెండు మూడు రోజులుగా అనుకుంటున్నట్లే ఏపీలో థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతం తగ్గించేశారు. అలాగే నైట్ కర్ఫ్యూ పెడుతుండటంతో సెకండ్ షోలు రద్దు చేయబోతున్నారు. ఇలాంటి ఆంక్షల మధ్య నాగ్ సినిమాను రిలీజ్ చేసి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో అన్నది సందేహంగా మారింది.
పోటీలో వేరే చిత్రాలు కూడా ఉన్నప్పటికీ.. బంగార్రాజుపైనే అందరి దృష్టీ ఉంది. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ కూడా ఆ సినిమా కోసమే చూస్తోంది. దీనిపై పెట్టుబడులు కూడా కొంచెం పెద్ద స్థాయిలోనే ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆంక్షల మధ్య సినిమాను రిలీజ్ చేస్తే ఆశించిన రెవెన్యూ రావడం కష్టమే. ఐతే థియేటర్లు ఎక్కువ సంఖ్యలోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి.. 50 శాతం ఆక్యుపెన్సీతోనూ మంచి రెవెన్యూనే రాబట్టవచ్చు.
గత ఏడాది సంక్రాంతికి క్రాక్ ఇలాంటి స్థితిలోనే భారీ వసూళ్లు తెచ్చుకుంది. కాకపోతే నైట్ షోలు రద్దయితే మాత్రం కష్టమే. కానీ ఇక్కడా ఓ వెసులుబాటు లేకపోలేదు. ఉదయం కాస్త ముందుగానే మార్నింగ్ షోలు మొదలుపెట్టి, కర్ఫ్యూ మొదలయ్యే సమయానికి నాలుగో షోను పూర్తి చేయొచ్చు. కానీ వారం తర్వాత కరోనా తీవ్రత ఇంకెంత పెరుగుతుందో.. అసలు థియేటర్లు పూర్తిగా మూతపడకుండా అందుబాటులో ఉంటాయా.. సినిమా రిలీజ్ చేశాక మధ్యలో రన్ ఆగిపోయే పరిస్థితి వస్తే ఎలా అన్న సందేహాలు చిత్ర బృందాన్ని కలవర పెడుతున్నాయి.
This post was last modified on January 8, 2022 3:21 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…