గత రెండేళ్ల వ్యవధిలో కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది సినీ ప్రముఖులు, దిగ్గజాలు కాలం చేశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా పలువురు వైరస్కు బలై అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తారు. కొందరు ఈ మహమ్మారి కారణంగా మృత్యు అంచుల దాకా వెళ్లి వచ్చారు. అందులో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా ఒకరు.
ఆయనకు గత ఏడాది కరోనా సోకి దాదాపు నెల రోజులు ఐసీయూలో ఉండటం, ఒక దశలో పరిస్థితి విషమించడం తెలిసిందే. అదృష్టవశాత్తూ ఆయన ఆ దశ నుంచి కోలుకుని మళ్లీ మామూలు మనిషి అయ్యారు. కోలుకున్నాక ఆయన శేఖర్ అనే సినిమాలోనూ నటించారు. అది త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ అనుభవం గురించి కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోలో రాజశేఖర్, ఆయన భార్య జీవిత మాట్లాడారు.
ఆ టైంలో తాను చనిపోతానని అనుకున్నట్లు రాజశేఖర్ చెప్పడం గమనార్హం. ఒక దశలో పరిస్థితి చేయి దాటిపోయిందని అనిపించిందని, ఇంకో మూడు రోజుల్లో తాను చనిపోతానని, తనను తీసుకెళ్లి తగలబెట్టేస్తారని అనుకున్నానని రాజశేఖర్ ఉద్వేగ స్వరంతో చెప్పారు. జీవిత మాట్లాడుతూ.. శేఖర్ సినిమా షూటింగ్ మొదలుపెడదాం అని అంతా ఏర్పాట్లు చేసుకున్న టైంలో రాజశేఖర్కు కరోనా సోకిందని, తర్వాత ఊహించని విధంగా పరిస్థితి విషమించి నెల రోజులు ఆయన ఐసీయూలో ఉండాల్సి వచ్చిందంటూ ఆ రోజులను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టేసుకున్నారు.
ఇలాంటి స్థితి నుంచి రాజశేఖర్ కోలుకుని చేసిన సినిమా కావడంతో శేఖర్ను చాలా ప్రత్యేకంగా భావిస్తానని జీవిత తెలిపారు. ఇంకా ఈ షోలో తమ కెరీర్ తొలి రోజుల గురించి, తమ ఇద్దరి తొలి కలయిక గురించి రాజశేఖర్, జీవిత మాట్లాడారు. సినిమాల్లోకి రాకముందు తనుకున్న నత్తి సమస్య గురించి కూడా రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.
This post was last modified on January 8, 2022 11:14 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…