గత రెండేళ్ల వ్యవధిలో కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది సినీ ప్రముఖులు, దిగ్గజాలు కాలం చేశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా పలువురు వైరస్కు బలై అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తారు. కొందరు ఈ మహమ్మారి కారణంగా మృత్యు అంచుల దాకా వెళ్లి వచ్చారు. అందులో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా ఒకరు.
ఆయనకు గత ఏడాది కరోనా సోకి దాదాపు నెల రోజులు ఐసీయూలో ఉండటం, ఒక దశలో పరిస్థితి విషమించడం తెలిసిందే. అదృష్టవశాత్తూ ఆయన ఆ దశ నుంచి కోలుకుని మళ్లీ మామూలు మనిషి అయ్యారు. కోలుకున్నాక ఆయన శేఖర్ అనే సినిమాలోనూ నటించారు. అది త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ అనుభవం గురించి కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోలో రాజశేఖర్, ఆయన భార్య జీవిత మాట్లాడారు.
ఆ టైంలో తాను చనిపోతానని అనుకున్నట్లు రాజశేఖర్ చెప్పడం గమనార్హం. ఒక దశలో పరిస్థితి చేయి దాటిపోయిందని అనిపించిందని, ఇంకో మూడు రోజుల్లో తాను చనిపోతానని, తనను తీసుకెళ్లి తగలబెట్టేస్తారని అనుకున్నానని రాజశేఖర్ ఉద్వేగ స్వరంతో చెప్పారు. జీవిత మాట్లాడుతూ.. శేఖర్ సినిమా షూటింగ్ మొదలుపెడదాం అని అంతా ఏర్పాట్లు చేసుకున్న టైంలో రాజశేఖర్కు కరోనా సోకిందని, తర్వాత ఊహించని విధంగా పరిస్థితి విషమించి నెల రోజులు ఆయన ఐసీయూలో ఉండాల్సి వచ్చిందంటూ ఆ రోజులను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టేసుకున్నారు.
ఇలాంటి స్థితి నుంచి రాజశేఖర్ కోలుకుని చేసిన సినిమా కావడంతో శేఖర్ను చాలా ప్రత్యేకంగా భావిస్తానని జీవిత తెలిపారు. ఇంకా ఈ షోలో తమ కెరీర్ తొలి రోజుల గురించి, తమ ఇద్దరి తొలి కలయిక గురించి రాజశేఖర్, జీవిత మాట్లాడారు. సినిమాల్లోకి రాకముందు తనుకున్న నత్తి సమస్య గురించి కూడా రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…