గత రెండేళ్ల వ్యవధిలో కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది సినీ ప్రముఖులు, దిగ్గజాలు కాలం చేశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా పలువురు వైరస్కు బలై అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తారు. కొందరు ఈ మహమ్మారి కారణంగా మృత్యు అంచుల దాకా వెళ్లి వచ్చారు. అందులో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా ఒకరు.
ఆయనకు గత ఏడాది కరోనా సోకి దాదాపు నెల రోజులు ఐసీయూలో ఉండటం, ఒక దశలో పరిస్థితి విషమించడం తెలిసిందే. అదృష్టవశాత్తూ ఆయన ఆ దశ నుంచి కోలుకుని మళ్లీ మామూలు మనిషి అయ్యారు. కోలుకున్నాక ఆయన శేఖర్ అనే సినిమాలోనూ నటించారు. అది త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ అనుభవం గురించి కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోలో రాజశేఖర్, ఆయన భార్య జీవిత మాట్లాడారు.
ఆ టైంలో తాను చనిపోతానని అనుకున్నట్లు రాజశేఖర్ చెప్పడం గమనార్హం. ఒక దశలో పరిస్థితి చేయి దాటిపోయిందని అనిపించిందని, ఇంకో మూడు రోజుల్లో తాను చనిపోతానని, తనను తీసుకెళ్లి తగలబెట్టేస్తారని అనుకున్నానని రాజశేఖర్ ఉద్వేగ స్వరంతో చెప్పారు. జీవిత మాట్లాడుతూ.. శేఖర్ సినిమా షూటింగ్ మొదలుపెడదాం అని అంతా ఏర్పాట్లు చేసుకున్న టైంలో రాజశేఖర్కు కరోనా సోకిందని, తర్వాత ఊహించని విధంగా పరిస్థితి విషమించి నెల రోజులు ఆయన ఐసీయూలో ఉండాల్సి వచ్చిందంటూ ఆ రోజులను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టేసుకున్నారు.
ఇలాంటి స్థితి నుంచి రాజశేఖర్ కోలుకుని చేసిన సినిమా కావడంతో శేఖర్ను చాలా ప్రత్యేకంగా భావిస్తానని జీవిత తెలిపారు. ఇంకా ఈ షోలో తమ కెరీర్ తొలి రోజుల గురించి, తమ ఇద్దరి తొలి కలయిక గురించి రాజశేఖర్, జీవిత మాట్లాడారు. సినిమాల్లోకి రాకముందు తనుకున్న నత్తి సమస్య గురించి కూడా రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.
This post was last modified on January 8, 2022 11:14 am
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…