కరోనా సెగ ఇండస్ట్రీని కన్ఫ్యూజ్ చేసి పారేస్తోంది. ఈ పరిస్థితి ఎంతవరకు ఉంటుందో, ఎప్పటికి పోతుందో తెలియని పరిస్థితి. సినిమా రిలీజులు ఆగిపోయాయి. ఇప్పుడు షూటింగులూ నిలిచిపోతున్నాయి. స్టార్ హీరోలంతా ఇప్పటికే తమ షెడ్యూల్స్లో మార్పులు చేస్తున్నారు. మిగతావారు కూడా పనులు ఆపేసే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ధనుష్ ‘సార్’ సినిమా షూటింగ్ మొదలయ్యిందంటూ ఓ ప్రకటన వచ్చింది.
వెంకీ అట్లూరి డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాని ఇటీవలే లాంఛనగా ప్రారంభించారు. ఇప్పుడు షూటింగ్ కూడా మొదలు పెట్టామని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అయితే రేపటి నుంచి ఈ సినిమా చిత్రీకరణను కూడా ఆపేస్తున్నట్లు తాజాగా తెలిసింది.
తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో రిస్క్ ఎక్కువ. త్వరలో కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించే చాన్స్ కూడా లేకపోలేదు. పైగా ఇప్పటికే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల దగ్గర్నుంచి తమన్ లాంటి టెక్నీషియన్స్ వరకు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. దాంతో తాను కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవడం బెటరని ధనుష్ ఫీలయ్యాడట.
ప్రస్తుతం ధనుష్ చేతిలో చాలా సినిమాలున్నాయి. కొన్ని ఆల్రెడీ మొదలయ్యాయి. కొన్ని లైన్లో ఉన్నాయి. పక్కా ప్లాన్తో వాటిని కంప్లీట్ చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత వర్క్ చేయడం పెద్ద రిస్క్. అందుకే షూటింగ్ ఆపుదామని తనే టీమ్తో చెప్పాడని, వాళ్లు కూడా సరే అన్నారని, రేపటి నుంచి షూట్కి బ్రేక్ ఇచ్చేస్తున్నారని సమాచారం అందుతోంది. రిస్క్ తీసుకోవడం కంటే కాస్త రెస్ట్ తీసుకుని ఫ్రెష్గా మొదలుపెట్టడం మంచిదే మరి!
This post was last modified on January 7, 2022 10:58 pm
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…