1945.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొత్త సినిమా. ఐతే పేరుకే ఇది కొత్త చిత్రం. ఇది మొదలైంది ఆరేళ్ల కిందట. బాహుబలి తర్వాత రానా ఒప్పుకుని లీడ్ రోల్ చేసిన సినిమాల్లో ఇదొకటి. తమిళ దర్శకుడైన సత్య శివ ఈ చిత్రాన్ని రూపొందించాడు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు. ఈ సినిమాలో అడ్రస్ లేకుండా పోయింది.
కొన్నేళ్ల పాటు దీని గురించి చర్చే లేదు. కానీ ఉన్నట్లుండి నెల కిందట ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. దీని రిలీజ్ గురించి సి.కళ్యాణ్ మీడియాకు సమాచారం ఇచ్చారు. ముందు డిసెంబరు 31న అనుకుని, ఆ తర్వాత డేట్ మార్చి ఆర్ఆర్ఆర్ ఖాళీ చేసిన జనవరి 7న ఈ సినిమాను థియేటర్లలోకి దించారు. చెప్పుకోదగ్గ కొత్త చిత్రాలేవీ లేకపోవడంతో దీనికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్క్రీన్లు దక్కాయి.
ఐతే రానా సినిమా, చారిత్రక నేపథ్యం.. రెజీనా, నాజర్, సత్యరాజ్ లాంటి పేరున్న ఆర్టిస్లులు నటించారు.. ఇవన్నీ చూసి సినిమాలో ఎంతో కొంత విషయం ఉంటుందనుకుని థియేటర్లకు వెళ్లిన వారికి దిమ్మదిరిగింది. ఇది అసలు పూర్తి కాకుండా అసంపూర్తిగా వదిలేసిన సినిమా అని తెలిసి నివ్వెర పోయారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా సరిగా చేయకపోవడం.. సినిమా అతుకుల బొంతలా ఉండటం.. సన్నివేశాల మధ్య కనెక్షన్ కట్ అయిపోవడం.. అన్నింటికీ మించి సినిమాలో రానా పాత్రకు ఇంకెవరో డబ్బింగ్ చెప్పడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.
సినిమా ఫలితమేంటో ముందే తెలిసిపోయిందో, ఇంకేవైనా ఇబ్బందులొచ్చాయో తెలియదు కానీ.. రానా ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేయలేదన్నది స్పష్టం. క్లైమాక్స్లో భారీ సన్నివేశం ఊహించుకుంటే కేవలం వాయిస్ ఓవర్తో లాగించి ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేశారు. రానా అందుబాటులో లేకపోవడం వల్లో ఏమో క్లైమాక్స్ షూట్ చేయనే లేదని, అలాగే అతనొచ్చి డబ్బింగ్ కూడా చెప్పలేదని అర్థమైంది. బహుశా అప్పటిదాకా తీసిన సినిమా ఔట్ పుట్ నచ్చకో, పారితోషకం విషయంలో తేడా వచ్చో రానా ఈ చిత్రాన్ని వదిలేసినట్లున్నాడు. అందుకే రిలీజ్ టైంలో కూడా దీని గురించి మాట్లాడలేదు. ప్రమోట్ చేయలేదు.
This post was last modified on January 7, 2022 10:25 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…