2021 సంవత్సరానికి అదిరిపోయే ముగింపును ఇచ్చింది ‘పుష్ప’ మూవీ. టాక్ పరంగా చూస్తే ఈ చిత్రం నిజానికి అంచనాలను అందుకోలేకపోయింది. తొలి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఐతే మిక్స్డ్ టాక్ను తట్టుకుని కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. చాలా చోట్ల బయ్యర్లకు మంచి లాభాలు అందించింది.
హిందీ, తమిళం, మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. కన్నడలో కూడా ఓకే. ఐతే తెలుగు వెర్షన్ తెలంగాణలో సక్సెస్ ఫుల్ అనిపించుకున్నా.. ఏపీలో మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్గానే నిలిచింది. యుఎస్లోనూ ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ కాలేదు. ఐతే హిందీలో ఈ చిత్రం అంచనాల్ని మించి ఆడేయడం నిర్మాతలకు బాగా కలిసొచ్చింది. రిలీజ్కు ముందు మంచి లాభాలతోనే అన్ని ఏరియాలకు రైట్స్ అమ్మగా.. విడుదల తర్వాత హిందీ నుంచి అదనపు ఆదాయం వచ్చింది.
ఓవరాల్గా ‘పుష్ప-1’ సక్సెస్ ఫుల్ అనిపించుకోవడం, ముఖ్యంగా హిందీలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడంతో ‘పుష్ప-2’కు మంచి బిజినెస్ ఆఫర్లు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప’ వల్ల నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు సినిమాను తీసుకుంది తమ రెగ్యులర్ బయ్యర్లే కావడంతో వాళ్లు నష్టపోకుండా ఏపీలో వివిధ ఏరియాల్లో ఎంత నష్టం వచ్చిందో చూసి అందులో 50 శాతం దాకా వెనక్కి ఇస్తున్నట్లు సమాచారం.
అంతే కాక ఏపీ వరకు ‘పుష్ప-2’ హక్కుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించబోతున్నారట. ఇలా చేయడం ద్వారా బయ్యర్లలో అసంతృప్తి లేకుండా చూసుకుంటున్నారు. దీని వల్ల మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చే మిగతా సినిమాలకు కలిసొస్తుంది. ఓవరాల్గా ‘పుష్ప’ ద్వారా మంచి లాభాలు అందుతుండటంతో ఈ మాత్రం నష్టాలు భరించడం మైత్రీ వాళ్లకు పెద్ద ఇబ్బందేమీ కాదు.
This post was last modified on January 7, 2022 4:08 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…