ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై కొన్ని రోజులుగా ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. దీనిపై సినీ ప్రముఖులు కొందరు ఘాటుగా మాట్లాడుతుంటే.. కొందరు సుతి మెత్తగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకొందరు మౌనం వహిస్తున్నారు. ఐతే ఎంత లౌక్యం ప్రదర్శిద్దామని, వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిద్దామని చూసినా.. తమ సినిమాల ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు వచ్చిన ప్రముఖులను మీడియా వాళ్లు వదలట్లేదు. ఈ అంశం మీద సూటిగా ప్రశ్నలు అడిగేస్తున్నారు.
ఇప్పుడు సీనియర్ హీరో కమ్ ప్రొడ్యూసర్ అక్కినేని నాగార్జునను సైతం మీడియా వాళ్లు ఈ విషయమై గట్టిగా అడిగేశారు. తన కొత్త చిత్రం బంగార్రాజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కోసం నాగ్ బుధవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏపీలో టికెట్ల రేట్ల గొడవపై మీరేమంటారు అని మీడియా వాళ్లు నాగ్ను ప్రశ్నించగా.. ఇది సినిమా వేడుక అని, ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడనని అనేశారు నాగ్. ఐతే సినిమా టికెట్ల గురించి అడిగితే ఇది రాజకీయ అంశం అంటాడేంటని అవాక్కవడం మీడియా వాళ్ల వంతయింది. నాగ్ అంతటితో ఆగకుండా టికెట్ల రేట్ల ప్రభావం తన సినిమా మీద ఉండదనడం ద్వారా ఏపీలో తగ్గించిన టికెట్ల రేట్ల వల్ల తనకే ఇబ్బందీ లేదన్నట్లు మాట్లాడటం మరింత ఆశ్చర్యం కలిగించేదే.
ఏపీ సీఎం జగన్కు నాగ్ చాలా క్లోజ్ అని అంతా అంటారు. మరి ఆయన చొరవ తీసుకుని జగన్తో మాట్లాడి ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూడొచ్చనే అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఐతే సమస్య ఉంది, పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం అనకుండా.. అసలు టికెట్ల రేట్ల ప్రభావం తన సినిమాపై ఉండదని నాగ్ అనడమేంటో ఎవరికీ అంతు బట్టడం లేదు.
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…
తెలంగాణలో ఓ కీలక నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
ఏపీ సీఎం చంద్రబాబు సాధారణ ప్రజలతో ఇటీవల కాలంలో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు…