వలిమై అని తమిళ సినిమా. కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో ఖాకి దర్శకుడు హెచ్.వినోద్ రూపొందించిన చిత్రమిది. బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇందులో విలన్ పాత్ర పోషించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. అజిత్ గత సినిమాల్లాగే దీన్ని కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం, రాధేశ్యామ్ కూడా అనుమానంగా మారడంతో ఈ చిత్రాన్ని తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజ్ చేసే అవకాశముంది. ఐతే ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేసినపుడు కనీసం తెలుగు టైటిల్ పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితి రావడమే దారుణం. ఈ సినిమాకు ఇంతకుముందు తమిళ టైటిల్కు సమాన అర్థం వచ్చేలా బలం అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి.
ఆ టైటిల్తో పోస్టర్లు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. వలిమై అనే టైటిలే పెట్టి అధికారికంగా పోస్టర్లు వదిలారు. జనవరి 13న రిలీజ్ అని కూడా ప్రకటించారు. టాలీవుడ్ పీఆర్వోలందరూ అఫీషియల్గానే ఈ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఐతే మరీ మన వాళ్లకు అర్థం కూడా తెలియని తమిళ టైటిల్తో తెలుగులో సినిమాను రిలీజ్ చేయడమేంటో అర్థం కావడం లేదు. ఒకవేళ హీరో పేరు సినిమా టైటిల్గా ఉంటే.. అలాంటపుడు తెలుగులో అదే పేరు పెట్టినా సరే అనకోవచ్చు.
కానీ ఇక్కడ కేస్ అది కాదు. ఈ సినిమాలో హీరో పేరేంటో చూసి దాన్నే తెలుగులో టైటిల్గా పెట్టినా ఓకే. కానీ ఇలా వలిమై అనే తమిళ పదాన్నే టైటిల్గా పెట్టి సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం విడ్డూరం. ఇంతకుముందు సింగం-2, సింగం-3 సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఐతే కనీసం సింహం, సింగం పదాలు దగ్గరగా ఉంటాయని అయినా సరిపెట్టుకోవచ్చు. కానీ వలిమై అంటే ఏంటో తెలియకుండా మన వాళ్లు వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకోవడమేంటో?
This post was last modified on January 4, 2022 9:45 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…