వలిమై అని తమిళ సినిమా. కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో ఖాకి దర్శకుడు హెచ్.వినోద్ రూపొందించిన చిత్రమిది. బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇందులో విలన్ పాత్ర పోషించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. అజిత్ గత సినిమాల్లాగే దీన్ని కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం, రాధేశ్యామ్ కూడా అనుమానంగా మారడంతో ఈ చిత్రాన్ని తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజ్ చేసే అవకాశముంది. ఐతే ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేసినపుడు కనీసం తెలుగు టైటిల్ పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితి రావడమే దారుణం. ఈ సినిమాకు ఇంతకుముందు తమిళ టైటిల్కు సమాన అర్థం వచ్చేలా బలం అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి.
ఆ టైటిల్తో పోస్టర్లు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. వలిమై అనే టైటిలే పెట్టి అధికారికంగా పోస్టర్లు వదిలారు. జనవరి 13న రిలీజ్ అని కూడా ప్రకటించారు. టాలీవుడ్ పీఆర్వోలందరూ అఫీషియల్గానే ఈ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఐతే మరీ మన వాళ్లకు అర్థం కూడా తెలియని తమిళ టైటిల్తో తెలుగులో సినిమాను రిలీజ్ చేయడమేంటో అర్థం కావడం లేదు. ఒకవేళ హీరో పేరు సినిమా టైటిల్గా ఉంటే.. అలాంటపుడు తెలుగులో అదే పేరు పెట్టినా సరే అనకోవచ్చు.
కానీ ఇక్కడ కేస్ అది కాదు. ఈ సినిమాలో హీరో పేరేంటో చూసి దాన్నే తెలుగులో టైటిల్గా పెట్టినా ఓకే. కానీ ఇలా వలిమై అనే తమిళ పదాన్నే టైటిల్గా పెట్టి సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం విడ్డూరం. ఇంతకుముందు సింగం-2, సింగం-3 సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఐతే కనీసం సింహం, సింగం పదాలు దగ్గరగా ఉంటాయని అయినా సరిపెట్టుకోవచ్చు. కానీ వలిమై అంటే ఏంటో తెలియకుండా మన వాళ్లు వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకోవడమేంటో?
This post was last modified on January 4, 2022 9:45 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…