ఇప్పుడు అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య చిన్న అంతరం వచ్చింది. చిరు మీద చిన్నపాటి యుద్ధం ప్రకటించాడు బాలయ్య. అయితే చిరంజీవి ఎప్పుడూ బాలయ్యను ఉద్దేశించి ఏమీ అన్నది లేదు. బుధవారం కూడా బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రేమగా ఒక ట్వీట్ పెట్టాడు. ఒకప్పుడు బాలయ్య సినిమాకు తన వంతుగా ప్రమోషన్ కూడా చేసిపెట్టిన పెద్ద మనసు చిరంజీవిది.
ఈ అరుదైన సంఘటన 1991లో జరిగింది. ఆ ఏడాది జులై 18న నందమూరి బాలకృష్ణ మైల్ స్టోన్ మూవీ ‘ఆదిత్య 369’ విడుదలైంది. అప్పట్లో అదో పెద్ద సంచలనం. అప్పటి తెలుగు సినిమా మార్కెట్ను మించి కోటిన్నర దాకా ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు నిర్మాత శివలెంక ప్రసాద్. విడుదలయ్యాక సినిమాకు మంచి స్పందనే వచ్చింది కానీ.. ఇలాంటి అరుదైన చిత్రాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నారాయన.
ఇదొక ప్రయోగాత్మక చిత్రం కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైపోతారేమో.. వాళ్లను కూడా థియేటర్లకు రప్పించడానికి ఏదైనా చేయాలనుకున్నారు. ఇందుకోసం చిరంజీవితో యాడ్స్ చేయించాలనుకున్నారు బాలయ్య, ప్రసాద్. వారి విన్నపానికి చిరు అంగీకరించారు. చిరుతో ఈ సినిమా గొప్పదనం చెప్పిస్తూ యాడ్స్ తయారు చేయించి దూరదర్శన్లో వేశారు. అవి కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. వాళ్లు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లారు. సినిమా అంచనాల్ని మించి విజయం సాధించింది.
పెట్టుబడి మీద ఆరు రెట్లు.. అంటే రూ.9 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకుంది. అలా బాలయ్య సినిమాకు చిరు ఇతోధిక సాయం చేశారు. దీన్ని బట్టి బాలయ్యతో చిరుకు ఎంత మంచి స్నేహం ఉండేది.. ఒక మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ఎంతగా తపించేవారు అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఉదంతాల్ని దృష్టిలో ఉంచుకుని అయినా బాలయ్య ఇప్పుడు కొంచెం దూకుడు తగ్గించుకుంటే మంచిదేమో.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…