ఇప్పుడు అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య చిన్న అంతరం వచ్చింది. చిరు మీద చిన్నపాటి యుద్ధం ప్రకటించాడు బాలయ్య. అయితే చిరంజీవి ఎప్పుడూ బాలయ్యను ఉద్దేశించి ఏమీ అన్నది లేదు. బుధవారం కూడా బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రేమగా ఒక ట్వీట్ పెట్టాడు. ఒకప్పుడు బాలయ్య సినిమాకు తన వంతుగా ప్రమోషన్ కూడా చేసిపెట్టిన పెద్ద మనసు చిరంజీవిది.
ఈ అరుదైన సంఘటన 1991లో జరిగింది. ఆ ఏడాది జులై 18న నందమూరి బాలకృష్ణ మైల్ స్టోన్ మూవీ ‘ఆదిత్య 369’ విడుదలైంది. అప్పట్లో అదో పెద్ద సంచలనం. అప్పటి తెలుగు సినిమా మార్కెట్ను మించి కోటిన్నర దాకా ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు నిర్మాత శివలెంక ప్రసాద్. విడుదలయ్యాక సినిమాకు మంచి స్పందనే వచ్చింది కానీ.. ఇలాంటి అరుదైన చిత్రాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నారాయన.
ఇదొక ప్రయోగాత్మక చిత్రం కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైపోతారేమో.. వాళ్లను కూడా థియేటర్లకు రప్పించడానికి ఏదైనా చేయాలనుకున్నారు. ఇందుకోసం చిరంజీవితో యాడ్స్ చేయించాలనుకున్నారు బాలయ్య, ప్రసాద్. వారి విన్నపానికి చిరు అంగీకరించారు. చిరుతో ఈ సినిమా గొప్పదనం చెప్పిస్తూ యాడ్స్ తయారు చేయించి దూరదర్శన్లో వేశారు. అవి కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. వాళ్లు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లారు. సినిమా అంచనాల్ని మించి విజయం సాధించింది.
పెట్టుబడి మీద ఆరు రెట్లు.. అంటే రూ.9 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకుంది. అలా బాలయ్య సినిమాకు చిరు ఇతోధిక సాయం చేశారు. దీన్ని బట్టి బాలయ్యతో చిరుకు ఎంత మంచి స్నేహం ఉండేది.. ఒక మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ఎంతగా తపించేవారు అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఉదంతాల్ని దృష్టిలో ఉంచుకుని అయినా బాలయ్య ఇప్పుడు కొంచెం దూకుడు తగ్గించుకుంటే మంచిదేమో.
This post was last modified on June 10, 2020 9:36 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…