అక్కినేని నాగార్జున సినిమా ‘బంగార్రాజు’ఫై రెండు వారాల ముందు వరకు ప్రేక్షకుల్లోనే కాక ట్రేడ్ వర్గాల్లో కూడా పెద్దగా ఆసక్తి కనిపించలేదు. బ్లాక్బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ఇది ప్రీక్వెల్ అయినప్పటికీ.. గత కొన్నేళ్లలో నాగ్ మార్కెట్ బాగా దెబ్బ తినేయడం, ఇప్పుడు ఈ సినిమా రిలీజవుతున్న టైమింగ్ కూడా బ్యాడ్ కావడమే అందుక్కారణం.
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు రిలీజవుతున్న సంక్రాంతి సీజన్లో సినిమాను రిలీజ్ చేస్తుండటంతో దీనిపై ఎవరూ అంతగా దృష్టిసారించలేదు. ఆ భారీ చిత్రాలకు పోగా ఈ చిత్రానికి ఏ మాత్రం థియేటర్లు దక్కుతాయో అన్నది కూడా సందేహంగానే కనిపించింది. దీంతో బయ్యర్లు ఈ సినిమాపై పెద్దగా పెట్టుబడి పెట్టడానికి సాహసించని పరిస్థితి నెలకొంది. ఓ మోస్తరు రేట్లకే సినిమాను అమ్మేసి, కుదిరినంత మేర థియేటర్లలో రిలీజ్ చేసి.. మంచి టాక్ వస్తే తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ నాగ్.
ఐతే కొన్ని రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిపోయింది. ‘రాధేశ్యామ్’ రాక కూడా అనుమానంగా మారింది. దీంతో ఒక్కసారిగా ‘రాధేశ్యామ్’ డ్రైవర్ సీట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ట్రేడ్లో ఈ సినిమా మీదే అమితాసక్తి కనిపిస్తోంది. సినిమాకు ఫ్యాన్సీ రేట్లిచ్చి వివిధ ఏరియాల హక్కులు తీసుకోవడానికి బయ్యర్లు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అనడంలో సందేహమే లేదు.
సంక్రాంతి రేసులోకి హఠాత్తుగా వచ్చి పడ్డ మిగతా చిన్న సినిమాలపై ఎవరికీ అంతగా ఆసక్తి కనిపించడం లేదు. ఫ్యామిలీస్ అంతా ఈ సినిమా కోసం పోటెత్తే అవకాశాలున్నాయి. సినిమాకు మంచి టాక్ రావాలే కానీ.. ‘సోగ్గాడే..’ను మించి ఈ చిత్రం సక్సెస్ కావడానికి ఆస్కారముంది. ‘రాధేశ్యామ్’ సంగతేంటో చూసి ‘బంగార్రాజు’కు డేట్ ఖరారు చేయాలని నాగ్ చూస్తున్నాడు. ముందు జనవరి 15కు అనుకున్నప్పటికీ.. ఇప్పుడు జనవరి 12నే సినిమాను రిలీజ్ చేయాలని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…