దర్శకధీరుడు రాజమౌళితో సినిమాలు చేయాలని చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా చాలా కాలంగా రాజమౌళితో సినిమా చేయాలనుకుంటున్నారు. సోలో నిర్మాతగా తన పేరు పడాలనేది కరణ్ జోహార్ కోరిక. ఈ విషయంలో రాజమౌళితో డీల్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్లుగా రాజమౌళి సినిమాలకు హిందీలో బ్యాక్ బోన్ గా నిలిచారు కరణ్.
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో పూర్తి సహకారం అందిస్తున్నారు. అయితే నిర్మాతగా రాజమౌళితో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ స్ట్రెయిట్ హిందీ సినిమాగా రూపొందుతుందట. రాజమౌళి గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. రాజమౌళి అంటే భారీ బడ్జెట్ సినిమాలే గుర్తొస్తాయి.
కానీ కరణ్ జోహార్ నిర్మాణంలో చేయబోయేది మాత్రం ఓ ప్రయోగాత్మక సినిమా అని తెలుస్తోంది. ఇందులో అందరూ కొత్తవాళ్లు లేదంటే యంగ్ నటులు ఉంటారని తెలుస్తోంది. గతంలో కూడా రాజమౌళి స్టార్లు లేకుండా సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అలానే హిట్ అందుకోవాలని చూస్తున్నారు.
నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తరువాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి. ఈ విషయాన్ని ఆయన అఫీషియల్ గా వెల్లడించారు. కానీ మధ్యలో ఏమైనా గ్యాప్ దొరికితే ఈ హిందీ ప్రాజెక్ట్ మొదలవుతుంది. లేదంటే మహేష్ సినిమాను పూర్తి చేసి అప్పుడు బాలీవుడ్ సినిమాను స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తారేమో చూడాలి!
This post was last modified on January 4, 2022 11:53 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…