ఊరించి ఊరించి ఉన్నట్లుండి.. ఉన్నట్లుండి వాయిదా పడిపోయింది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. రెండు వారాల ముందు వరకు అస్సలు ఊహించని పరిణామం ఇది. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. థియేటర్ల బుకింగ్స్ పూర్తయింది. విదేశాల్లో అయితే టికెట్ల అమ్మకాలు కూడా చాలా రోజుల ముందే మొదలయ్యాయి. జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్లు కూడా ఒక రేంజ్లో చేశారు. ‘బాహుబలి’తో పోలిస్తే ఈ సినిమా రిలీజ్ ముంగిట రాజమౌళి చాలా రిలాక్స్డ్గా కనిపించాడు.
ప్రమోషన్లను ముందుండి నడిపించాడు. సినిమా తీయడానికి పడ్డ కష్టానికి తోడు ఆయన ప్రమోషన్ల కోసం కూడా తన టీంతో కలిసి చాలా కష్టపడ్డాడు. వివిధ భాషలకు కేంద్రంగా ఉండే ప్రధాన నగరాల్లో ఈవెంట్లు చేశారు. మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇందుకోసం చాలా రోజులే వెచ్చించాడు. ప్రమోషన్ కోసం ఖర్చు కూడా కాస్త ఎక్కువే అయింది. ఆ బడ్జెట్తో మీడియం రేంజ్ సినిమా కూడా తీయొచ్చంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా నడిచింది.
విడుదలకు చాలా సమీపంలో ఇలా సినిమాను వాయిదా వేయడం వల్ల చాలా నష్టాలే ఉన్నాయి చిత్ర బృందానికి. ప్రమోషన్ కోసం పెట్టిన ఖర్చు, సమయం, ఎనర్జీ అంతా వేస్ట్ అయింది. దీనికి తోడు సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ చాలానే ఉపయోగించారు. ఐతే ఇప్పుడు మళ్లీ ఇంకో డేట్ ఎంచుకుంటే.. కొత్తగా ఆఫ్ లైన్, ఆన్ లైన్ ప్రమోషన్లు చేయాలి. ఇక సినిమా నుంచి రిలీజ్ చేయడానికి కంటెంట్ కూడా తక్కువే ఉంటుంది.
మళ్లీ టీం అంతా వివిధ నగరాల్లో తిరిగి ఈవెంట్లు చేయాలంటే చాలా కష్టం. ఇప్పట్లా హైప్ తీసుకురావడానికి మళ్లీ చాలా కష్టపడాలి. ఆల్రెడీ చేశాం కదా అని.. ఇంకోసారి చేయకుండా వదిలేసే రకం కాదు జక్కన్న. ఇక ఇప్పటికే సినిమా బాగా ఆలస్యం కావడం వల్ల వడ్డీల భారం బాగానే పడింది. ఇప్పుడు అవి మరింత తడిసి మోపెడవుతాయి. నష్టాలు వస్తాయని కాదు కానీ.. ఆదాయంలో కోత పడుతుంది. మళ్లీ థియేటర్ల బుకింగ్స్, కొత్తగా అగ్రిమెంట్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాల్లో మార్పులు చేర్పులు.. ఇలా చాలా తలనొప్పులే ఉంటాయి చిత్ర బృందానికి.
This post was last modified on January 2, 2022 8:43 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…