విజయ్ దేవరకొండ హీరోగా తన కెరీర్ మొదలుపెట్టిన తరువాత వరుసగా సినిమాలను విడుదల చేస్తూ వచ్చాడు. ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు అతడి రేంజ్ ని అమాంతం పెంచేశాయి. ఆ తరువాత ఫ్లాప్ లు వచ్చినప్పటికీ.. అవి విజయ్ పై ఎంతమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇదిలా ఉండగా.. విజయ్ రెండేళ్లుగా ఒక సినిమా కోసమే వర్క్ చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ‘లైగర్’ సినిమా కోసం తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ల సమయాన్ని కేటాయించేశాడు విజయ్. 2020 జనవరిలో మొదలైన ఈ సినిమా 2022 ఆగస్టులో విడుదల కానుంది. హీరోగా ఎంతో పాపులారిటీ పొందిన ఒక యంగ్ హీరో రెండేళ్లపాటు తన కాల్షీట్స్ ఒక సినిమాకి ఇవ్వడమంటే మాములు విషయం కాదు. ఈ గ్యాప్ లో అతడు రెండు, మూడు సినిమా తీసేసి బాగా సంపాదించుకోవచ్చు.
కానీ విజయ్ మాత్రం అలా చేయలేదు. ‘లైగర్’ సినిమాపై అతడి చాలా నమ్మకం ఉంది. ఈ సినిమాతో తన రేంజ్ మరింత పెరుగుతుందని నమ్ముతున్నారు విజయ్. పూరి కూడా ఈ సినిమా సక్సెస్ పై ధీమాగా ఉన్నారు. ‘లైగర్’ షూటింగ్ సమయంలో పూరికి, విజయ్ కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా విజయ్ తో చేయాలనుకుంటున్నారు పూరి.
అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ‘లైగర్’ సినిమా తరువాత విజయ్ దేవరకొండ.. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. దర్శకుడు శివ నిర్వాణ చాలా రోజులుగా విజయ్ దేవరకొండ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ముందుగా విజయ్ ఏ ప్రాజెక్ట్ మొదలుపెడతారో చూడాలి!
This post was last modified on January 2, 2022 6:28 pm
ఒక హీరో వరుసగా డిజాస్టర్లు ఇచ్చినపుడు.. తన చివరి హిట్ ఎప్పుడో తన అభిమానులు కూడా మరిచిపోయినపుడు.. అతను కొత్తగా…
ఎల్లుండి విడుదల కాబోతున్న కొరియన్ కనకరాజుకి రేపు రాత్రి ప్రీమియర్లు వేయడం దాదాపు ఫిక్స్. ఇంకా టికెట్ల అమ్మకాలు మొదలుకాలేదు…
జూన్ నెలలో పెద్ది విడుదల ముందు వరకు దర్శకుడు బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ ఒకటే కాదు ఇండస్ట్రీ జనాలు…
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు వివాదాలకు దూరంగా, కొంచెం ప్రశాంతంగా బతుకుతున్నాడు కానీ.. ఒకప్పుడు ఆయనతో ముడిపడ్డ…