విజయ్ దేవరకొండ హీరోగా తన కెరీర్ మొదలుపెట్టిన తరువాత వరుసగా సినిమాలను విడుదల చేస్తూ వచ్చాడు. ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు అతడి రేంజ్ ని అమాంతం పెంచేశాయి. ఆ తరువాత ఫ్లాప్ లు వచ్చినప్పటికీ.. అవి విజయ్ పై ఎంతమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇదిలా ఉండగా.. విజయ్ రెండేళ్లుగా ఒక సినిమా కోసమే వర్క్ చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ‘లైగర్’ సినిమా కోసం తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ల సమయాన్ని కేటాయించేశాడు విజయ్. 2020 జనవరిలో మొదలైన ఈ సినిమా 2022 ఆగస్టులో విడుదల కానుంది. హీరోగా ఎంతో పాపులారిటీ పొందిన ఒక యంగ్ హీరో రెండేళ్లపాటు తన కాల్షీట్స్ ఒక సినిమాకి ఇవ్వడమంటే మాములు విషయం కాదు. ఈ గ్యాప్ లో అతడు రెండు, మూడు సినిమా తీసేసి బాగా సంపాదించుకోవచ్చు.
కానీ విజయ్ మాత్రం అలా చేయలేదు. ‘లైగర్’ సినిమాపై అతడి చాలా నమ్మకం ఉంది. ఈ సినిమాతో తన రేంజ్ మరింత పెరుగుతుందని నమ్ముతున్నారు విజయ్. పూరి కూడా ఈ సినిమా సక్సెస్ పై ధీమాగా ఉన్నారు. ‘లైగర్’ షూటింగ్ సమయంలో పూరికి, విజయ్ కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా విజయ్ తో చేయాలనుకుంటున్నారు పూరి.
అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ‘లైగర్’ సినిమా తరువాత విజయ్ దేవరకొండ.. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. దర్శకుడు శివ నిర్వాణ చాలా రోజులుగా విజయ్ దేవరకొండ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ముందుగా విజయ్ ఏ ప్రాజెక్ట్ మొదలుపెడతారో చూడాలి!
This post was last modified on January 2, 2022 6:28 pm
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…