దర్శకరత్న దాసరి నారాయణరావు ఉన్నంత కాలం ఆయనే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేవారు. ఎవరికే సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళ్లేవారు. ఆయనే పంచాయితీలు పెట్టి తగవులు తీర్చేవారు. ఇండస్ట్రీ తరఫున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలన్నా ఆయనే ముందుండి నడిపించేవారు. ఐతే ఆయన మరణానంతరం ఆ కుర్చీ ఎక్కడానికి చాలామందికి ధైర్యం సరిపోలేదు. ఇది లేని పోని తలనొప్పిగా భావించారు చాలామంది. అలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి బాధ్యత తీసుుకన్నారు.
ఈ విషయంలో కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఒత్తిడి తెచ్చి ఆయన్ని ఇండస్ట్రీ పెద్ద స్థానంలో కూర్చోబెట్టారు. ఇదేమీ అధికారిక పదవి కాదు. చిరంజీవి కూడా అలా భావించలేదు. ముందు నుంచే చిరంజీవిది పెద్ద మనసు. ఆయన సేవా కార్యక్రమాల సంగతి తెలిసిందే. ఈ బాధ్యత తీసుకున్నాక మరింతగా సేవా కార్యక్రమాలను విస్తరించారు. కరోనా టైంలో గొప్పగా సినీ కార్మికులను ఆదుకున్నారు. ఐతే కొన్ని నెలల కిందట ‘మా’ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో చిరు కొంత మనస్తాపం చెందినట్లే కనిపిస్తున్నారు.
ఇండస్ట్రీ పెద్ద హోదా గురించి తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని.. ఆ పదవి వద్దని.. తాను పంచాయితీలు చేయాలనుకోవట్లేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. అవసరానికి ఎవరికైనా అండగా ఉంటానని.. కానీ అనవసర వివాదాల్లో తాను తలదూర్చనని.. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకిష్టం లేదని చిరు అన్నారు. ఐతే సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఏ సాయం అవసరమైనా సాయం అందించడానికి తాను సిద్ధంగా ఉంటానని చిరు స్పష్టం చేశారు.
ఇండస్ట్రీ పెద్దగా అనధికారిక బాధ్యత తీసుకున్నాక చిరు ఇండస్ట్రీ కోసం ఎంతో చేసినా ఆయన మాటలు పడాల్సి వచ్చింది. వీలైనంత మేర అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేసినా కొన్ని విమర్శలు తప్పలేదు. ‘మా’ ఎన్నికల్లో నుంచి నుంచి పరోక్ష మద్దతు పొందిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడం చిరును ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. పైగా ఆ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచాక.. ఇండస్ట్రీ పెద్ద పదవి ఖాళీగా ఉందని, ఆ స్థానంలోకి రావాలని మోహన్ బాబును నరేష్ కోరడం కూడా చిరును బాధించి ఉండొచ్చు. తాను ఇంత చేసినా.. ఇలాంటి కామెంట్లు వినాల్సి వచ్చిన నేపథ్యంలో చిరు ఈ హోదా తనకు వద్దని స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నారు.
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…
నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని…
ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్…
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…