దర్శకరత్న దాసరి నారాయణరావు ఉన్నంత కాలం ఆయనే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేవారు. ఎవరికే సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళ్లేవారు. ఆయనే పంచాయితీలు పెట్టి తగవులు తీర్చేవారు. ఇండస్ట్రీ తరఫున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలన్నా ఆయనే ముందుండి నడిపించేవారు. ఐతే ఆయన మరణానంతరం ఆ కుర్చీ ఎక్కడానికి చాలామందికి ధైర్యం సరిపోలేదు. ఇది లేని పోని తలనొప్పిగా భావించారు చాలామంది. అలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి బాధ్యత తీసుుకన్నారు.
ఈ విషయంలో కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఒత్తిడి తెచ్చి ఆయన్ని ఇండస్ట్రీ పెద్ద స్థానంలో కూర్చోబెట్టారు. ఇదేమీ అధికారిక పదవి కాదు. చిరంజీవి కూడా అలా భావించలేదు. ముందు నుంచే చిరంజీవిది పెద్ద మనసు. ఆయన సేవా కార్యక్రమాల సంగతి తెలిసిందే. ఈ బాధ్యత తీసుకున్నాక మరింతగా సేవా కార్యక్రమాలను విస్తరించారు. కరోనా టైంలో గొప్పగా సినీ కార్మికులను ఆదుకున్నారు. ఐతే కొన్ని నెలల కిందట ‘మా’ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో చిరు కొంత మనస్తాపం చెందినట్లే కనిపిస్తున్నారు.
ఇండస్ట్రీ పెద్ద హోదా గురించి తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని.. ఆ పదవి వద్దని.. తాను పంచాయితీలు చేయాలనుకోవట్లేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. అవసరానికి ఎవరికైనా అండగా ఉంటానని.. కానీ అనవసర వివాదాల్లో తాను తలదూర్చనని.. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకిష్టం లేదని చిరు అన్నారు. ఐతే సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఏ సాయం అవసరమైనా సాయం అందించడానికి తాను సిద్ధంగా ఉంటానని చిరు స్పష్టం చేశారు.
ఇండస్ట్రీ పెద్దగా అనధికారిక బాధ్యత తీసుకున్నాక చిరు ఇండస్ట్రీ కోసం ఎంతో చేసినా ఆయన మాటలు పడాల్సి వచ్చింది. వీలైనంత మేర అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేసినా కొన్ని విమర్శలు తప్పలేదు. ‘మా’ ఎన్నికల్లో నుంచి నుంచి పరోక్ష మద్దతు పొందిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడం చిరును ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. పైగా ఆ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచాక.. ఇండస్ట్రీ పెద్ద పదవి ఖాళీగా ఉందని, ఆ స్థానంలోకి రావాలని మోహన్ బాబును నరేష్ కోరడం కూడా చిరును బాధించి ఉండొచ్చు. తాను ఇంత చేసినా.. ఇలాంటి కామెంట్లు వినాల్సి వచ్చిన నేపథ్యంలో చిరు ఈ హోదా తనకు వద్దని స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నారు.
This post was last modified on January 2, 2022 2:21 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…