దర్శకరత్న దాసరి నారాయణరావు ఉన్నంత కాలం ఆయనే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేవారు. ఎవరికే సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళ్లేవారు. ఆయనే పంచాయితీలు పెట్టి తగవులు తీర్చేవారు. ఇండస్ట్రీ తరఫున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలన్నా ఆయనే ముందుండి నడిపించేవారు. ఐతే ఆయన మరణానంతరం ఆ కుర్చీ ఎక్కడానికి చాలామందికి ధైర్యం సరిపోలేదు. ఇది లేని పోని తలనొప్పిగా భావించారు చాలామంది. అలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి బాధ్యత తీసుుకన్నారు.
ఈ విషయంలో కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఒత్తిడి తెచ్చి ఆయన్ని ఇండస్ట్రీ పెద్ద స్థానంలో కూర్చోబెట్టారు. ఇదేమీ అధికారిక పదవి కాదు. చిరంజీవి కూడా అలా భావించలేదు. ముందు నుంచే చిరంజీవిది పెద్ద మనసు. ఆయన సేవా కార్యక్రమాల సంగతి తెలిసిందే. ఈ బాధ్యత తీసుకున్నాక మరింతగా సేవా కార్యక్రమాలను విస్తరించారు. కరోనా టైంలో గొప్పగా సినీ కార్మికులను ఆదుకున్నారు. ఐతే కొన్ని నెలల కిందట ‘మా’ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో చిరు కొంత మనస్తాపం చెందినట్లే కనిపిస్తున్నారు.
ఇండస్ట్రీ పెద్ద హోదా గురించి తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని.. ఆ పదవి వద్దని.. తాను పంచాయితీలు చేయాలనుకోవట్లేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. అవసరానికి ఎవరికైనా అండగా ఉంటానని.. కానీ అనవసర వివాదాల్లో తాను తలదూర్చనని.. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకిష్టం లేదని చిరు అన్నారు. ఐతే సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఏ సాయం అవసరమైనా సాయం అందించడానికి తాను సిద్ధంగా ఉంటానని చిరు స్పష్టం చేశారు.
ఇండస్ట్రీ పెద్దగా అనధికారిక బాధ్యత తీసుకున్నాక చిరు ఇండస్ట్రీ కోసం ఎంతో చేసినా ఆయన మాటలు పడాల్సి వచ్చింది. వీలైనంత మేర అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేసినా కొన్ని విమర్శలు తప్పలేదు. ‘మా’ ఎన్నికల్లో నుంచి నుంచి పరోక్ష మద్దతు పొందిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడం చిరును ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. పైగా ఆ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచాక.. ఇండస్ట్రీ పెద్ద పదవి ఖాళీగా ఉందని, ఆ స్థానంలోకి రావాలని మోహన్ బాబును నరేష్ కోరడం కూడా చిరును బాధించి ఉండొచ్చు. తాను ఇంత చేసినా.. ఇలాంటి కామెంట్లు వినాల్సి వచ్చిన నేపథ్యంలో చిరు ఈ హోదా తనకు వద్దని స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నారు.
This post was last modified on January 2, 2022 2:21 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…