Movie News

టికెట్ల రేట్లపై జగన్ కామెంట్

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల వ్యవహారం కొన్ని నెలల నుంచి ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ తేవడం.. ఈ కారణంగా చిన్న సెంటర్లలో థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారడం తెలిసిందే. ముందుగా పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేస్తూ ఈ నియంత్రణ తీసుకురాగా.. ఆ తర్వాత మొత్తం అన్ని సినిమాలకూ అది తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్య అంతకంతకూ జఠిలంగా మారి.. ఎంతకీ పరిష్కారం రావట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై బాగా విమర్శలు వచ్చాయి.

ఐతే టికెట్ల ధరల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం పెద్దగా లేదని, ఆయనకు ఈ విషయమై సరైన సమాచారం లేదని.. మంత్రులు, అధికారులే ఆయన్ని తప్పుదోవ పట్టించారని ఓ వర్గం మీడియాలో ప్రచారం సాగింది. కానీ జగన్ ప్రమేయం లేకుండా ఏమీ ఇదంతా జరగలేదని.. ఈ విషయంలో ఆయన పూర్తి స్పష్టతతోనే ఉన్నారని తేలిపోయింది.

ఇన్నాళ్లు టికెట్ల ధరల వ్యవహారంపై మంత్రులే మాట్లాడుతూ వచ్చారు. ప్రభుత్వ నిర్ణయాల్ని సమర్థిస్తూ వచ్చారు. ప్రజల మంచి కోసమే ఇదంతా చేస్తున్నామని చెబుతూ వచ్చారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఇదే తరహాలో మాట్లాడారు. ‘‘పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే.. ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా? ఇటువంటి వారు పేదల గురించి పట్టించుకునేవాళ్లేనా? ఇలాంటి వాళ్లు పేదవారికి శత్రువులు కాదా అని అందరూ ఆలోచించాలని కోరుతున్నా.

పేదలకు మంచి చేస్తుంటే అడ్డుపడకూడదనే జ్ఞానం ఇలాంటి వాళ్లకు దేవుడు ఇవ్వాలి’’ అంటూ కొత్త సంవత్సరం సందర్భంగా చేసిన ప్రసంగంలో జగన్ వ్యాఖ్యానించారు. ఐతే టికెట్ల ధరలు తగ్గించి పేదలకు మేలు చేయాలనుకోవడం బాగానే ఉంది కానీ.. అలాగే నిత్యావసరాలు ధరలు కూడా తగ్గించాలని జనాలు ముందు నుంచి చేస్తున్న డిమాండ్లే ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి భారం కాకుండా సీఎంకు చెందిన భారతి సిమెంట్ ధరల్ని తగ్గించాంటూ నెటిజన్లు ఎప్పట్లాగే కౌంటర్లు వేస్తున్నారు.

This post was last modified on January 1, 2022 8:40 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

2 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

2 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

2 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

3 hours ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

4 hours ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

5 hours ago