‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ఓవర్ నైట్ కార్తికేయ జాతకం మారిపోయింది. ఈ యంగ్ హీరో వెంటనే చాలా బిజీ అయిపోయాడు. మూడేళ్ల వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలు చేసేశాడు. కానీ తన దగ్గరికొచ్చిన ప్రతి సినిమానూ ఒప్పేసుకుని హడావుడిగా లాగించేయడంతో అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. చివరికి అల్లు అరవింద్ ప్రొడక్షన్లో చేసిన ‘చావు కబురు చల్లగా’ సైతం అతణ్ని తీవ్ర నిరాశకే గురి చేసింది. లేటెస్టుగా కార్తికేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ అయితే రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనట్లుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.
దెబ్బకు టాలీవుడ్లో కార్తికేయ కెరీర్ బాగా డల్లయిపోయింది. అతడి మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక తెలుగులో అతడి కెరీర్ ముందుకు సాగడమే సందేహంగా మారింది. కానీ ఇదే టైంలో కార్తికేయ.. కోలీవుడ్లో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీకి రెడీ అవుతుండటం విశేషం.కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ సినిమాతో కార్తికేయ తమిళంలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
అజిత్ కొత్త చిత్రం ‘వలిమై’లో కార్తికేయనే ప్రధాన విలన్. ముందు ఈ సినిమాలో కార్తికేయ నటిస్తున్నాడంటే ఏదో సహాయ పాత్ర అనుకున్నారు కానీ.. మెయిన్ విలన్ పాత్ర తనే చేస్తున్నాడని అనుకోలేదు. కానీ ఫస్ట్ టీజర్ రిలీజయ్యాకే తెలిసిందే అజిత్కు దీటైన విలన్ పాత్ర చేస్తున్నాడని. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో కార్తికేయను చూసి అటు తమిళ ప్రేక్షకులు, ఇటు తెలుగు వాళ్లు వావ్ అనుకుంటున్నారు.
ఇంత భారీ చిత్రంలో, అజిత్ లాంటి సూపర్ స్టార్ను సవాలు చేసే దీటైన విలన్ పాత్ర చేయడం.. ప్రతి షాట్లోనూ తన ప్రత్యేకతను చాటుకోవడంతో కార్తికేయ అందరిలోనూ బాగా రిజిస్టర్ అయిపోయాడు. సినిమా స్యూర్ షాట్ హిట్ లాగా కనిపిస్తోంది. ‘వలిమై’ అంచనాలకు తగ్గట్లు ఉండి, కార్తికేయ పాత్ర కూడా క్లిక్ అయితే.. తమిళంలో అతను మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోతాడేమో. తెలుగులో కెరీర్ పోయినా తమిళంలో సెటిలయ్యేందుకు ‘వలిమై’ బాగానే కలిసొచ్చేలా ఉంది.
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…