‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ఓవర్ నైట్ కార్తికేయ జాతకం మారిపోయింది. ఈ యంగ్ హీరో వెంటనే చాలా బిజీ అయిపోయాడు. మూడేళ్ల వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలు చేసేశాడు. కానీ తన దగ్గరికొచ్చిన ప్రతి సినిమానూ ఒప్పేసుకుని హడావుడిగా లాగించేయడంతో అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. చివరికి అల్లు అరవింద్ ప్రొడక్షన్లో చేసిన ‘చావు కబురు చల్లగా’ సైతం అతణ్ని తీవ్ర నిరాశకే గురి చేసింది. లేటెస్టుగా కార్తికేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ అయితే రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనట్లుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.
దెబ్బకు టాలీవుడ్లో కార్తికేయ కెరీర్ బాగా డల్లయిపోయింది. అతడి మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక తెలుగులో అతడి కెరీర్ ముందుకు సాగడమే సందేహంగా మారింది. కానీ ఇదే టైంలో కార్తికేయ.. కోలీవుడ్లో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీకి రెడీ అవుతుండటం విశేషం.కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ సినిమాతో కార్తికేయ తమిళంలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
అజిత్ కొత్త చిత్రం ‘వలిమై’లో కార్తికేయనే ప్రధాన విలన్. ముందు ఈ సినిమాలో కార్తికేయ నటిస్తున్నాడంటే ఏదో సహాయ పాత్ర అనుకున్నారు కానీ.. మెయిన్ విలన్ పాత్ర తనే చేస్తున్నాడని అనుకోలేదు. కానీ ఫస్ట్ టీజర్ రిలీజయ్యాకే తెలిసిందే అజిత్కు దీటైన విలన్ పాత్ర చేస్తున్నాడని. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో కార్తికేయను చూసి అటు తమిళ ప్రేక్షకులు, ఇటు తెలుగు వాళ్లు వావ్ అనుకుంటున్నారు.
ఇంత భారీ చిత్రంలో, అజిత్ లాంటి సూపర్ స్టార్ను సవాలు చేసే దీటైన విలన్ పాత్ర చేయడం.. ప్రతి షాట్లోనూ తన ప్రత్యేకతను చాటుకోవడంతో కార్తికేయ అందరిలోనూ బాగా రిజిస్టర్ అయిపోయాడు. సినిమా స్యూర్ షాట్ హిట్ లాగా కనిపిస్తోంది. ‘వలిమై’ అంచనాలకు తగ్గట్లు ఉండి, కార్తికేయ పాత్ర కూడా క్లిక్ అయితే.. తమిళంలో అతను మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోతాడేమో. తెలుగులో కెరీర్ పోయినా తమిళంలో సెటిలయ్యేందుకు ‘వలిమై’ బాగానే కలిసొచ్చేలా ఉంది.
This post was last modified on December 31, 2021 9:15 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…