‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ఓవర్ నైట్ కార్తికేయ జాతకం మారిపోయింది. ఈ యంగ్ హీరో వెంటనే చాలా బిజీ అయిపోయాడు. మూడేళ్ల వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలు చేసేశాడు. కానీ తన దగ్గరికొచ్చిన ప్రతి సినిమానూ ఒప్పేసుకుని హడావుడిగా లాగించేయడంతో అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. చివరికి అల్లు అరవింద్ ప్రొడక్షన్లో చేసిన ‘చావు కబురు చల్లగా’ సైతం అతణ్ని తీవ్ర నిరాశకే గురి చేసింది. లేటెస్టుగా కార్తికేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ అయితే రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనట్లుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.
దెబ్బకు టాలీవుడ్లో కార్తికేయ కెరీర్ బాగా డల్లయిపోయింది. అతడి మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక తెలుగులో అతడి కెరీర్ ముందుకు సాగడమే సందేహంగా మారింది. కానీ ఇదే టైంలో కార్తికేయ.. కోలీవుడ్లో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీకి రెడీ అవుతుండటం విశేషం.కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ సినిమాతో కార్తికేయ తమిళంలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
అజిత్ కొత్త చిత్రం ‘వలిమై’లో కార్తికేయనే ప్రధాన విలన్. ముందు ఈ సినిమాలో కార్తికేయ నటిస్తున్నాడంటే ఏదో సహాయ పాత్ర అనుకున్నారు కానీ.. మెయిన్ విలన్ పాత్ర తనే చేస్తున్నాడని అనుకోలేదు. కానీ ఫస్ట్ టీజర్ రిలీజయ్యాకే తెలిసిందే అజిత్కు దీటైన విలన్ పాత్ర చేస్తున్నాడని. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో కార్తికేయను చూసి అటు తమిళ ప్రేక్షకులు, ఇటు తెలుగు వాళ్లు వావ్ అనుకుంటున్నారు.
ఇంత భారీ చిత్రంలో, అజిత్ లాంటి సూపర్ స్టార్ను సవాలు చేసే దీటైన విలన్ పాత్ర చేయడం.. ప్రతి షాట్లోనూ తన ప్రత్యేకతను చాటుకోవడంతో కార్తికేయ అందరిలోనూ బాగా రిజిస్టర్ అయిపోయాడు. సినిమా స్యూర్ షాట్ హిట్ లాగా కనిపిస్తోంది. ‘వలిమై’ అంచనాలకు తగ్గట్లు ఉండి, కార్తికేయ పాత్ర కూడా క్లిక్ అయితే.. తమిళంలో అతను మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోతాడేమో. తెలుగులో కెరీర్ పోయినా తమిళంలో సెటిలయ్యేందుకు ‘వలిమై’ బాగానే కలిసొచ్చేలా ఉంది.
This post was last modified on December 31, 2021 9:15 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…