Movie News

టికెట్ల రేట్లు బూమరాంగ్?

టికెట్ల రేట్ల విషయంలో ఏపీలో చూస్తే అనావృష్టి.. తెలంగాణలో చూస్తే అతివృష్టి అన్నట్లే ఉంది పరిస్థితి. ఏపీలో కనీస ధరలు కూడా కరవై.. థియేటర్ల మెయింటైనెన్స్‌ కష్టమయ్యే పరిస్థితి ఉంది. నగర పంచాయితీలు, మున్సిపాలిటీలు అని తేడా చూపించకుండా కనీస ధర రూ.100 ఉండేలా చూడాలని అక్కడ ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ నెలల తరబడి పరిస్థితి మారకపోవడంతో థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

కానీ తెలంగాణలో దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆల్రెడీ ఇక్కడ పరిశ్రమ కోరుకునే స్థాయిలోనే రేట్లు ఉన్నాయి. మల్టీప్లెక్సుల్లో కనీస ధర రూ.150గా ఉంది. ఏఎంబీ సినిమాస్ లాంటి పెద్ద మల్టీప్లెక్సులు రూ.200 కనీస ధరతో టికెట్లు అమ్ముతున్నాయి. సింగిల్ స్క్రీన్లలో సగటు ధర రూ.110-120గా ఉన్నాయి. ఈ ధరలు ప్రేక్షకుడికీ ఓకే. అటు ఇండస్ట్రీకి కూడా ఓకే అనే చెప్పాలి.

కానీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. అక్కడే వచ్చింది సమస్య.కొత్త సినిమాలకు గతంలో సింగిల్ స్క్రీన్లలో రూ.150కి, మల్టీప్లెక్సుల్లో రూ.200కి రేట్లు పెంచుకునేవారు. కానీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్లలోనే కనీస ధర రూ.200 చేసేశారు. మల్టీప్లెక్సుల రేటు రూ.250తో మొదలవుతోంది. ఇది ప్రేక్షకులకు కచ్చితంగా భారమే. పెద్ద సినిమాకు డిమాండ్ ఉంది కదా అని మరీ ఈ స్థాయిలో రేట్లు పెంచడమేంటి అని ప్రేక్షకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇది చాలదన్నట్లు ఇప్పుడు మొత్తంగానే టికెట్ల రేట్లు పెంచేశారు. ఇటీవల సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు రూ.150 వరకు, మల్టీప్లెక్సుల్లో రూ.200 నుంచి 350 వరకు రేటు పెంచుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఐతే ప్రేక్షకుల సౌలభ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన ఎగ్జిబిటర్లు ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్లు చాలా వరకు రూ.150కి రేటు పెంచేశాయి. మల్టీప్లెక్సుల రేటు రూ.200తో మొదలైంది. ఇన్నాళ్లూ ప్రసాద్ మల్టీప్లెక్సులో రూ.150గా ఉన్న ధర ఒక్కసారిగా రూ.295కి పెంచి పడేశారు. ఇక బుక్ మై షోలో టికెట్ బుక్ చేస్తే ఇంకో రూ.20 అదనం. ఈ శుక్రవారం ‘అర్జున ఫల్గుణ’ అనే చిన్న సినిమా రిలీజవుతోంది.

అలాంటి సినిమాకు రూ.315 రూపాయలు పెట్టి టికెట్ బుక్ చేసుకుని థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలని సామాన్య ప్రేక్షకుడు అనుకుంటాడా? ఆ డబ్బులకు సంవత్సరం మొత్తానికి ఆహా లాంటి ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్ వచ్చేస్తున్నపుడు థియేటర్‌కు వెళ్లి ఒక్కరు అంత రేటు పెట్టి ఒక సినిమా చూడాలంటే మనసొప్పుతుందా? చూస్తుంటే ఈ ధరల పెంపు బూమరాంగ్ అయి పరిశ్రమకు చేటు చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇది శాపంలా మారే ప్రమాదం ఉంది.

This post was last modified on December 30, 2021 6:54 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

2 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

2 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

6 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

6 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

7 hours ago