Movie News

మోహన్ బాబు ఇల్లు.. కళ్లు కుట్టే వైభవం

మంచు మోహన్ బాబు కేవలం సినిమాలనే నమ్ముకుని ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఇక్కడ సంపాదించిన డబ్బులతో తిరుపతిలో విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పి దాన్ని భారీ స్థాయిలో విస్తరించి తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద విద్యా సంస్థల్లో ఒకదానిగా తీర్చిదిద్దారు. దీన్నుంచి ఆయనకు భారీగానే ఆదాయం వస్తుంటుంది ఏటా. సినిమాల ద్వారా చాలా ఏళ్ల నుంచి ఆదాయం రాకపోగా.. రివర్సులో నష్టాలొస్తున్నాయి. అయినా ఆయనకు ఆర్థికంగా ఢోకా లేకపోయింది. విద్యా సంస్థలు గొప్పగా నడుస్తున్నాయి. ఆయనకు ఆదాయాన్ని పెంచుతున్నాయి.

ఈ ఆదాయంతోనే ఆయన చాలా ఏళ్ల కిందట శంషాబాద్‌లో కొన్ని ఎకరాల స్థలం కొనుక్కున్నారు. అందులో ఒక రాజప్రసాదం లాంటి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లున్న స్థలం కంటే చుట్టూ ఉన్న ఉద్యానవనం కొన్ని రెట్లు పెద్దది. ఆ ఇంటి గురించి అందరూ చెబుతుంటే వినడమే తప్ప సామాన్య జనాలకు పెద్దగా తెలియదు.

ఇప్పుడు మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి ఆ ఇంటి విశేషాలను వీడియో రూపంలో తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకుంది. కొన్ని రోజుల కిందటే ఆమె తన తండ్రి ఇంటికి సంబంధించి హోమ్ టూర్ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో ఇంటి మీద వీడియో తీస్తున్నందుకు మోహన్ బాబు కోప్పడట్లు కనిపించారు. కానీ అసలు వీడియో చూస్తే అక్కడ నిజంగా ఏ గొడవా జరగలేదని అర్థమైంది. ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మొత్తంగా ఇంటితో పాటు ఉద్యానవనంలోని అన్ని విశేషాలను ఆమె ఈ వీడియోలో పంచుకుంది.

అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం మూడు ఫోర్లున్న ఇంటిలోపల ఒక్కో గదిని చూస్తే కళ్లు చెదరక మానదు. పెద్ద హోం థియేటర్ మేడ మీద స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్.. భారీ డైనింగ్ రూం, ఆఫీస్ రూమ్స్, లివింగ్ రూమ్స్.. ఇలా అన్నీ చూస్తే మోహన్ బాబు ఇంటి వైభవం చూసి సెలబ్రెటీలకు సైతం కళ్లు కుట్టక మానదు. ఫిలిం సెలబ్రెటీలందరూ సిటీలో కాంక్రీట్ జంగిల్స్‌లో ఉంటే.. మోహన్ బాబు మాత్రం ప్రకృతి మధ్య రాజప్రసాదం లాంటి ఇల్లు కట్టుకుని ఇంత ప్రశాంతంగా గడుపుతున్నందుకు కూడా ఆయనపై అసూయ కలగొచ్చు.

Satya

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

24 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

3 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

7 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

7 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago