లేక లేక టీవీ ఛానెళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే అనేక వివాదాస్పద కామెంట్లు చేశారు. అనేక అంశాలపై స్పందించారు.
తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఎయిటీస్ రీయూనియన్ కార్యక్రమానికి తనను పిలవకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరు ఇంట్లో ఈ వేడుక జరిగితే తనను పిలవకపోవడం ఏంటని ఆయనన్నారు. తనను ఇగ్నోర్ చేస్తే పూర్తిగా ఇగ్నోర్ చేయాలన్న కామెంట్ కూడా చేశారు. అందరితో చాలా మర్యాదగా వ్యవహరించే చిరు.. ఇలా బాలయ్యను ఎలా విస్మరించాడనే ప్రశ్న అందరిలోనూ ఉదయించింది. కానీ దీని వెనుక వేరే కథ ఉంది.
2015లో ఈ రీయూనియన్ సందర్భంగా ఒక చిన్న ఇబ్బంది చోటు చేసుకుంది. దాని గురించి బాలయ్యే గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగుతుండగా.. కొందరు కుర్చీల్లో పైన కూర్చుంటే.. కొందరు కింద కూర్చున్నారట. ఐతే ఆ ఫొటో దిగబోతుండగా.. రజనీ కాంత్ గ్రూప్లోకి రావడంతో కింద ఉన్న సుహాసిని ‘రజనీసార్ వస్తున్నారు. బాలయ్యా కిందకు వచ్చేయ్’ అన్నారట.
ఇది బాలయ్యకు ఆగ్రహం తెప్పించింది. అందరూ ఒక్కటే అని కలుస్తున్నపుడు.. ఇలా రజనీ సార్ వచ్చారు కిందికి రా అనడం ఏంటి అన్నది బాలయ్య అభ్యంతరం. ‘‘అందరం ఒకటనుకుని కలిస్తే తేడాలు చూపించేసరికి నాకు కోపం వచ్చింది. ‘రజనీ సారేంటి? ఎవడు సూపర్ స్టార్?’’ అని అరిచా. ‘ఫొటో తియ్యండి’ అన్నా. అయ్యాకే కిందికి వచ్చా. నేను పర్ఫెక్షనిస్ట్ని. నా చుట్టూ అందరూ అలానే ఉండాలనుకుంటా. లేకపోతే కోపం వస్తుంది’’ అని నాటి అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బాలయ్య. ఇది జరిగిన తర్వాత ఇటు బాలయ్య కానీ, అటు రజనీ కానీ ఈ రీయూనియన్ కార్యక్రమానికి రాలేదు. ఈ క్రమంలోనే చిరు కూడా బాలయ్యను పిలవడం మానేసి ఉంటారేమో.
This post was last modified on June 10, 2020 11:02 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…