లేక లేక టీవీ ఛానెళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే అనేక వివాదాస్పద కామెంట్లు చేశారు. అనేక అంశాలపై స్పందించారు.
తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఎయిటీస్ రీయూనియన్ కార్యక్రమానికి తనను పిలవకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరు ఇంట్లో ఈ వేడుక జరిగితే తనను పిలవకపోవడం ఏంటని ఆయనన్నారు. తనను ఇగ్నోర్ చేస్తే పూర్తిగా ఇగ్నోర్ చేయాలన్న కామెంట్ కూడా చేశారు. అందరితో చాలా మర్యాదగా వ్యవహరించే చిరు.. ఇలా బాలయ్యను ఎలా విస్మరించాడనే ప్రశ్న అందరిలోనూ ఉదయించింది. కానీ దీని వెనుక వేరే కథ ఉంది.
2015లో ఈ రీయూనియన్ సందర్భంగా ఒక చిన్న ఇబ్బంది చోటు చేసుకుంది. దాని గురించి బాలయ్యే గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగుతుండగా.. కొందరు కుర్చీల్లో పైన కూర్చుంటే.. కొందరు కింద కూర్చున్నారట. ఐతే ఆ ఫొటో దిగబోతుండగా.. రజనీ కాంత్ గ్రూప్లోకి రావడంతో కింద ఉన్న సుహాసిని ‘రజనీసార్ వస్తున్నారు. బాలయ్యా కిందకు వచ్చేయ్’ అన్నారట.
ఇది బాలయ్యకు ఆగ్రహం తెప్పించింది. అందరూ ఒక్కటే అని కలుస్తున్నపుడు.. ఇలా రజనీ సార్ వచ్చారు కిందికి రా అనడం ఏంటి అన్నది బాలయ్య అభ్యంతరం. ‘‘అందరం ఒకటనుకుని కలిస్తే తేడాలు చూపించేసరికి నాకు కోపం వచ్చింది. ‘రజనీ సారేంటి? ఎవడు సూపర్ స్టార్?’’ అని అరిచా. ‘ఫొటో తియ్యండి’ అన్నా. అయ్యాకే కిందికి వచ్చా. నేను పర్ఫెక్షనిస్ట్ని. నా చుట్టూ అందరూ అలానే ఉండాలనుకుంటా. లేకపోతే కోపం వస్తుంది’’ అని నాటి అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బాలయ్య. ఇది జరిగిన తర్వాత ఇటు బాలయ్య కానీ, అటు రజనీ కానీ ఈ రీయూనియన్ కార్యక్రమానికి రాలేదు. ఈ క్రమంలోనే చిరు కూడా బాలయ్యను పిలవడం మానేసి ఉంటారేమో.
This post was last modified on June 10, 2020 11:02 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…