నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్కు ఉన్న క్రేజే వేరు. బాలయ్య ఎప్పుడు స్లంప్లో ఉన్నా బోయపాటి వస్తాడు. ఒక బ్లాక్ బస్టర్ ఇస్తాడు. ఇంతకుముందు సింహా, లెజెండ్ సినిమాలతో అలాగే బాలయ్యను పైకి లేపాడు. ఇప్పుడు యన్.టి.ఆర్, రూలర్ సినిమాలతో తల బొప్పి కట్టించుకున్న బాలయ్యకు మరోసారి బోయపాటి ఉపశమనాన్ని అందించేలాగే ఉన్నాడు.
బుధవారం బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు రోజు వీరి కలయికలో రానున్న కొత్త సినిమా టీజర్ వదిలారు. అది ఈ కాంబినేషన్పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగానే ఉంది. అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా ఈ టీజర్ కట్ చేశారు. బాలయ్య లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్, మ్యూజిక్.. ఇలా అన్నీ పక్కా కుదిరాయి ఈ టీజర్లో.
ఇందులో బాలయ్య పలికిన డైలాగ్ ఇన్స్టంట్ హిట్టయిపోయింది. ఎదుటివాడితో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో తెలుసుకో. శ్రీను గారు మీ నాన్న బాగున్నారా ? అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా? అనడానికి చాలా తేడా ఉంటుందిరా లండీకొడకా.. ఇదీ బాలయ్య పేల్చిన డైలాగ్. అమ్మ మొగుడు అన్న పదం వినగానే బాలయ్య పంచ్ ఎవరికన్నది స్పష్టంగా అర్థమైపోతుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైకాపా నాయకుడు కొడాలి నాని తరచుగా నీ అమ్మా మొగుడు చెప్పాడా అని ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. ప్రెస్ మీట్లలోనే కాదు.. అసెంబ్లీలో సైతం ఆయన ఆ మాట వాడాడు. ఒకప్పుడు టీడీపీలో ఉండి.. తర్వాత వైకాపాకు మారి చంద్రబాబు, లోకేష్ సహా తెలుగుదేశం అగ్ర నాయకులపై తీవ్ర స్థాయిలో తిట్లు కురిపిస్తుంటారు నాని. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఈ డైలాగ్తో నానికి కౌంటర్ ఇచ్చినట్లున్నాడు.
This post was last modified on June 10, 2020 11:04 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…