యూట్యూబ్లో, హిందీ ఛానెళ్లలో రిలీజైన డబ్బింగ్ సినిమాల ద్వారా అల్లు అర్జున్ ఉత్తరాదిన మంచి ఫాలోయింగే సంపాదించాడు కానీ.. అతడి సినిమాను అక్కడి జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తారా అన్న డౌట్లే కలిగాయి పుష్ప రిలీజ్ ముందు అందరికీ. విడుదల ముందు హిందీలో ఈ చిత్రానికి అంతగా హైప్ కూడా కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగానే కనిపించాయి. ఐతే డివైడ్ టాక్తో మొదలైన ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్లో పుంజుకున్న తీరు అనూహ్యం.
తొలి రోజును మించి తర్వాతి రెండు రోజుల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టడమే కాదు.. వీక్ డేస్లో కూడా వీక్ అవ్వకుండా ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. ఐదు రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసింది పుష్ప హిందీ వెర్షన్. వారం రోజుల్లో పాతిక కోట్ల మార్కునూ దాటింది. ఇప్పుడు రెండో వీకెండ్ అయ్యేసరికి పుష్ప హిందీ వెర్షన్ వసూళ్లు రూ.37 కోట్లకు చేరుకోవడం విశేషం.
క్రిస్మస్ వీకెండ్ను ఈ చిత్రం పూర్తిగా ఉపయోగించుకుంది. ఆదివారం ఈ చిత్రానికి హిందీ బెల్ట్లో రూ.4.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ రావడం విశేషం. రెండో ఆదివారం ఓ సౌత్ డబ్బింగ్ మూవీకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం అనూహ్యమే. ఒక దశలో 30 కోట్ల మార్కును అందుకుంటుందన్న అంచనాలు కలగ్గా.. ఇప్పుడు 40 కోట్ల మార్కుకు చేరువగా ఉంది పుష్ప.
ఈ సినిమా రూ.50 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదేమో. నార్త్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల్లో బాహుబలి-2, బాహుబలి-1, సాహో, కేజీఎఫ్ తొలి నాలుగు స్థానాల్లో ఉండగా.. ఇప్పుడు పుష్ప మూడో స్థానానికి చేరేలా కనిపిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్-1 హిందీ వెర్షన్ రూ.44 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. పుష్ప త్వరలోనే దాన్ని అధిగమించేలా కనిపిస్తోంది. 50 కోట్ల మార్కును అందుకోవడం మాత్రం ఈ వారాంతంలో వచ్చే జెర్సీ ఫలితం మీద ఆధార పడి ఉంది.
This post was last modified on December 28, 2021 12:25 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…