ఇండియాలో లాక్ డౌన్ ఆరంభం కావడానికి ముందు సూపర్ హిట్టయిన సినిమాల్లో అయ్యప్పనుం కోషీయుం ఒకటి. పృథ్వీరాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ మూవీ కేరళలో అదరగొట్టింది. లాక్ డౌన్ టైంలో వివిధ భాషల వాళ్లు అమేజాన్ ప్రైమ్లో ఈ సినిమాను విరగబడి చూశారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం బయటికి రావడంతో తెలుగు వాళ్లు మరింతగా ఈ సినిమాపై ఆసక్తి ప్రదర్శించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అయ్యప్పనుం కోషీయుం రీమేక్ హక్కులు కొన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ప్రధాన పాత్రల కోసం నటీనటుల వేట సాగిస్తోంది ఆ సంస్థ. వేర్వేరు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. చివరికి ఖరారైంది మాత్రం రవితేజ, రానా అన్నది తాజా సమాచారం.
బిజు మీనన్ చేసిన పవర్ ఫుల్ పోలీస్ పాత్రను రవితేజ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిల్లో ఎక్కువ వెయిట్ ఉన్న పాత్ర అదే. ఇక ఆర్మీలో పని చేసి వచ్చి హై ప్రొఫైల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే పెద్దింటి వ్యక్తి పాత్రలో రానా కనిపించనున్నాడు. ఐతే హీరోల పేర్లు ఖరారయ్యాయి కానీ.. ఇంత వరకు ఈ రీమేక్కు దర్శకుడెవరన్నది తెలియడం లేదు. ఆగస్టులో షూటింగ్ ఆరంభిస్తామని సితార వాళ్లు మీడియాకు హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రవితేజ-రానా జోడీని తెరపై చూడటం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగస్వామి అయ్యే అవకాశముంది. రవితేజ ప్రస్తుతం క్రాక్ మూవీలో నటిస్తుండగా.. రానా విరాట పర్వం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు.
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…