ఇండియాలో లాక్ డౌన్ ఆరంభం కావడానికి ముందు సూపర్ హిట్టయిన సినిమాల్లో అయ్యప్పనుం కోషీయుం ఒకటి. పృథ్వీరాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ మూవీ కేరళలో అదరగొట్టింది. లాక్ డౌన్ టైంలో వివిధ భాషల వాళ్లు అమేజాన్ ప్రైమ్లో ఈ సినిమాను విరగబడి చూశారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం బయటికి రావడంతో తెలుగు వాళ్లు మరింతగా ఈ సినిమాపై ఆసక్తి ప్రదర్శించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అయ్యప్పనుం కోషీయుం రీమేక్ హక్కులు కొన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ప్రధాన పాత్రల కోసం నటీనటుల వేట సాగిస్తోంది ఆ సంస్థ. వేర్వేరు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. చివరికి ఖరారైంది మాత్రం రవితేజ, రానా అన్నది తాజా సమాచారం.
బిజు మీనన్ చేసిన పవర్ ఫుల్ పోలీస్ పాత్రను రవితేజ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిల్లో ఎక్కువ వెయిట్ ఉన్న పాత్ర అదే. ఇక ఆర్మీలో పని చేసి వచ్చి హై ప్రొఫైల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే పెద్దింటి వ్యక్తి పాత్రలో రానా కనిపించనున్నాడు. ఐతే హీరోల పేర్లు ఖరారయ్యాయి కానీ.. ఇంత వరకు ఈ రీమేక్కు దర్శకుడెవరన్నది తెలియడం లేదు. ఆగస్టులో షూటింగ్ ఆరంభిస్తామని సితార వాళ్లు మీడియాకు హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రవితేజ-రానా జోడీని తెరపై చూడటం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగస్వామి అయ్యే అవకాశముంది. రవితేజ ప్రస్తుతం క్రాక్ మూవీలో నటిస్తుండగా.. రానా విరాట పర్వం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు.
This post was last modified on June 10, 2020 11:04 am
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…
ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…