దర్శకుడి మీద ఎంత గురి ఉన్నా సరే.. కథ వినకుండా సినిమా చేయడం అంటే కష్టమే. పెద్ద పెద్ద దర్శకులతో సినిమా చేస్తున్నా సరే.. హీరోలు లాంఛనానికి అయినా ఒకసారి కథ వింటారు. కానీ చాలా కొద్ది మంది దర్శకుల మీద మాత్రం హీరోలకు అపరిమితమైన నమ్మకం ఉంటుంది. స్క్రిప్టు ఊసెత్తకుండా సినిమాలు చేసేస్తారు. రామ్ చరణ్ అలా సినిమాలు చేసే దర్శకులు ఇద్దరు మాత్రమేనట.
అందులో ఒకరు తనతో ఇంతకుముందు ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ తీసి, ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీని తెరకెక్కించిన రాజమౌళి అట. మరొకరు చరణ్కు ‘రంగస్థలం’ లాంటి మరపురాని చిత్రాన్ని అందించిన సుకుమార్ అట. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ కథ వినకుండానే ఈ సినిమా చేశారట కదా అని అడిగితే.. అది నిజమే అని చరణ్ తెలిపాడు.
తాను కథ వినకుండా సినిమాలు చేసే దర్శకులు ఇద్దరే అని.. అందులో ఒకరు రాజమౌళి అయితే.. మరొకరు సుకుమార్ అని వెల్లడించాడు మెగా పవర్ స్టార్. రాజమౌళి తనతో చేసిన రెండు సినిమాలకూ కథ వినలేదని.. అలాగే ‘రంగస్థలం’ సినిమాకు సుకుమార్ దగ్గరా కథ వినలేదని.. ఇకముందు కూడా వీళ్లిద్దరూ కథ చెప్పకపోయినా సినిమా చేస్తానని చరణ్ తెలిపాడు.
మీ మీద హీరోలకు ఇంత నమ్మకమా.. మీరు ఏం చెప్పినా హీరోలు చేస్తారా అని రాజమౌళిని అడిగితే.. తన మీద హీరోలకు ఉన్న నమ్మకానికి సంతోషమే అని.. కానీ ఏం చెప్పినా ఓకే చేస్తారు.. తన సినిమాలో ఎవరైనా నటిస్తారు అనే భావన తనకు వస్తే అది తన పతనానికి నాంది అవుతుందని రాజమౌళి చెప్పాడు. తనతో ఎవరు పని చేసినా తాను కోరుకున్న ఔట్ పుట్ వచ్చే వరకు రాజీ పడననేది వాస్తవమే అని.. ఎవరు తక్కువ చేసినా తాను ఊహించుకున్నట్లుగా సన్నివేశం రాదేమో అన్న భయం తనను వెంటాడుతుందని.. అందుకే కఠినంగా ఉంటానని జక్కన్న తెలిపాడు.
This post was last modified on December 26, 2021 2:35 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…