దర్శకుడి మీద ఎంత గురి ఉన్నా సరే.. కథ వినకుండా సినిమా చేయడం అంటే కష్టమే. పెద్ద పెద్ద దర్శకులతో సినిమా చేస్తున్నా సరే.. హీరోలు లాంఛనానికి అయినా ఒకసారి కథ వింటారు. కానీ చాలా కొద్ది మంది దర్శకుల మీద మాత్రం హీరోలకు అపరిమితమైన నమ్మకం ఉంటుంది. స్క్రిప్టు ఊసెత్తకుండా సినిమాలు చేసేస్తారు. రామ్ చరణ్ అలా సినిమాలు చేసే దర్శకులు ఇద్దరు మాత్రమేనట.
అందులో ఒకరు తనతో ఇంతకుముందు ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ తీసి, ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీని తెరకెక్కించిన రాజమౌళి అట. మరొకరు చరణ్కు ‘రంగస్థలం’ లాంటి మరపురాని చిత్రాన్ని అందించిన సుకుమార్ అట. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ కథ వినకుండానే ఈ సినిమా చేశారట కదా అని అడిగితే.. అది నిజమే అని చరణ్ తెలిపాడు.
తాను కథ వినకుండా సినిమాలు చేసే దర్శకులు ఇద్దరే అని.. అందులో ఒకరు రాజమౌళి అయితే.. మరొకరు సుకుమార్ అని వెల్లడించాడు మెగా పవర్ స్టార్. రాజమౌళి తనతో చేసిన రెండు సినిమాలకూ కథ వినలేదని.. అలాగే ‘రంగస్థలం’ సినిమాకు సుకుమార్ దగ్గరా కథ వినలేదని.. ఇకముందు కూడా వీళ్లిద్దరూ కథ చెప్పకపోయినా సినిమా చేస్తానని చరణ్ తెలిపాడు.
మీ మీద హీరోలకు ఇంత నమ్మకమా.. మీరు ఏం చెప్పినా హీరోలు చేస్తారా అని రాజమౌళిని అడిగితే.. తన మీద హీరోలకు ఉన్న నమ్మకానికి సంతోషమే అని.. కానీ ఏం చెప్పినా ఓకే చేస్తారు.. తన సినిమాలో ఎవరైనా నటిస్తారు అనే భావన తనకు వస్తే అది తన పతనానికి నాంది అవుతుందని రాజమౌళి చెప్పాడు. తనతో ఎవరు పని చేసినా తాను కోరుకున్న ఔట్ పుట్ వచ్చే వరకు రాజీ పడననేది వాస్తవమే అని.. ఎవరు తక్కువ చేసినా తాను ఊహించుకున్నట్లుగా సన్నివేశం రాదేమో అన్న భయం తనను వెంటాడుతుందని.. అందుకే కఠినంగా ఉంటానని జక్కన్న తెలిపాడు.
This post was last modified on December 26, 2021 2:35 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…