హీరోయిన్లు బాగా ఇబ్బంది పడే సన్నివేశాల్లో ముందు వరుసలో ఉండేవి ఇంటిమేట్, బోల్డ్ సీన్లు. ఆ తర్వాత సిగరెట్ తాగడం, మందు కొట్టడం లాంటి సన్నివేశాలే. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఈ రెండు సీన్లూ చేసి ఆశ్చర్యపరిచింది యువ కథానాయిక కృతి శెట్టి. తొలి చిత్రం ఉప్పెనలో పల్లెటూరి అమ్మాయిగా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కృతి.. రెండో చిత్రానికి పూర్తిగా అవతారం మార్చేసింది.
మోడర్న్ అమ్మాయిగా కనిపించింది. శ్యామ్ సింగరాయ్లో ఆమె చేసిన కీర్తి అనే మోడర్న్ సిటీ అమ్మాయిగా కనిపించింది కృతి. ఇందులో ఆమె నానితో కలిసి లిప్ లాక్, బోల్డ్ సీన్స్ చేయడంతో పాటు సిగరెట్ తాగే సన్నివేశాల్లోనూ నటించింది. ఐతే బోల్డ్ సీన్స్ కంటే కూడా సిగరెట్ తాగే సన్నివేశంలోనే తాను ఎక్కువ ఇబ్బంది పడ్డట్లు కృతి వెల్లడించింది. బేసిగ్గా తనకు సిగరెట్ తాగే వాళ్లంటే అస్సలు పడదని, వాళ్లకు చాలా దూరంగా ఉంటానని కృతి చెప్పింది.
అలాంటిది తెరమీద సిగరెట్ తాగే అమ్మాయిగా నటించడం ఏంటి అనిపించిందని.. ఇదే మాట దర్శకుడు రాహుల్ సంకృత్యన్తో అంటే.. మరి వ్యక్తిగా కృతికి, నటిగా కీర్తికి తేడా చూపించాలి కదా అని తనతో చెప్పి ఈ సన్నివేశం చేయడానికి ఒప్పించాడని.. తాను ఇబ్బంది పడకుండా ఆరోగ్య సేతు సిగరెట్లు తెప్పించాడని.. అవి పాల రుచితో ఉంటాయని.. అయినప్పటికీ తాను సిగరెట్ తాగే సీన్లలో ఇబ్బంది పడుతూనే చేశానని.. ఆ సన్నివేశం చేస్తున్నపుడు తనకు వణుకొచ్చిందని కృతి చెప్పింది.
ఇక బోల్డ్ సీన్ల గురించి వివరిస్తూ.. ఇలాంటివి చేసేటపుడు తాము నటనలో భాగంగానే, పాత్ర కోసమే చేస్తున్నామన్న ఆలోచనే ఉంటుందని, కథ డిమాండ్ చేస్తే అలాంటివి చేయడంలో తప్పేమీ లేదని.. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నానీతో ఆ సీన్లు చేసేటపుడు తాను ఇబ్బంది పడలేదని కృతి వెల్లడించింది.
This post was last modified on December 25, 2021 8:25 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…