హీరోయిన్లు బాగా ఇబ్బంది పడే సన్నివేశాల్లో ముందు వరుసలో ఉండేవి ఇంటిమేట్, బోల్డ్ సీన్లు. ఆ తర్వాత సిగరెట్ తాగడం, మందు కొట్టడం లాంటి సన్నివేశాలే. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఈ రెండు సీన్లూ చేసి ఆశ్చర్యపరిచింది యువ కథానాయిక కృతి శెట్టి. తొలి చిత్రం ఉప్పెనలో పల్లెటూరి అమ్మాయిగా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కృతి.. రెండో చిత్రానికి పూర్తిగా అవతారం మార్చేసింది.
మోడర్న్ అమ్మాయిగా కనిపించింది. శ్యామ్ సింగరాయ్లో ఆమె చేసిన కీర్తి అనే మోడర్న్ సిటీ అమ్మాయిగా కనిపించింది కృతి. ఇందులో ఆమె నానితో కలిసి లిప్ లాక్, బోల్డ్ సీన్స్ చేయడంతో పాటు సిగరెట్ తాగే సన్నివేశాల్లోనూ నటించింది. ఐతే బోల్డ్ సీన్స్ కంటే కూడా సిగరెట్ తాగే సన్నివేశంలోనే తాను ఎక్కువ ఇబ్బంది పడ్డట్లు కృతి వెల్లడించింది. బేసిగ్గా తనకు సిగరెట్ తాగే వాళ్లంటే అస్సలు పడదని, వాళ్లకు చాలా దూరంగా ఉంటానని కృతి చెప్పింది.
అలాంటిది తెరమీద సిగరెట్ తాగే అమ్మాయిగా నటించడం ఏంటి అనిపించిందని.. ఇదే మాట దర్శకుడు రాహుల్ సంకృత్యన్తో అంటే.. మరి వ్యక్తిగా కృతికి, నటిగా కీర్తికి తేడా చూపించాలి కదా అని తనతో చెప్పి ఈ సన్నివేశం చేయడానికి ఒప్పించాడని.. తాను ఇబ్బంది పడకుండా ఆరోగ్య సేతు సిగరెట్లు తెప్పించాడని.. అవి పాల రుచితో ఉంటాయని.. అయినప్పటికీ తాను సిగరెట్ తాగే సీన్లలో ఇబ్బంది పడుతూనే చేశానని.. ఆ సన్నివేశం చేస్తున్నపుడు తనకు వణుకొచ్చిందని కృతి చెప్పింది.
ఇక బోల్డ్ సీన్ల గురించి వివరిస్తూ.. ఇలాంటివి చేసేటపుడు తాము నటనలో భాగంగానే, పాత్ర కోసమే చేస్తున్నామన్న ఆలోచనే ఉంటుందని, కథ డిమాండ్ చేస్తే అలాంటివి చేయడంలో తప్పేమీ లేదని.. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నానీతో ఆ సీన్లు చేసేటపుడు తాను ఇబ్బంది పడలేదని కృతి వెల్లడించింది.
This post was last modified on December 25, 2021 8:25 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…