Movie News

సంక్రాంతి రేసులో ‘డీజే టిల్లు’!

,2022 సంక్రాంతికి రావడానికి పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి సినిమాలు బరిలో ఉండడంతో మిగిలిన సినిమాలు తమ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నారు. సంక్రాంతికి రావాలనుకున్న పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమాను బలవంతంగా వాయిదా వేయించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ విడుదలవుతాయా..? లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

దానికి కారణం కరోనా మహమ్మారి. చాలా రాష్ట్రాల్లో కరోనా మూడో దశ ప్రభావం చూపిస్తోంది. ముంబై లాంటి సిటీల్లో ప్రభుత్వం కర్ఫ్యూలు కూడా విధించింది. థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ విధించారు. తమిళనాడు, కర్ణాటక కూడా ఇదే రూట్ ను ఫాలో అవుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతల్లో టెన్షన్ నెలకొంది. 

ఇదిలా ఉండగా.. ఇప్పడు సంక్రాంతి బరిలోకి ‘డీజే టిల్లు’ సినిమా దిగుతోందని సమాచారం. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ రొమాంటిక్ డ్రామాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. 

ఇప్పుడు సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాను నిర్మించారు. సినిమాలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలతో పోటీగా ఇప్పుడు సడెన్ గా ఓ చిన్న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో పాటు నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది. 

This post was last modified on December 25, 2021 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

25 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

58 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago