దర్శకులు నటులు కావడం తరచుగా చూస్తుంటాం కానీ.. నటులు దర్శకులు కావడం అరుదే. అందులోనూ హీరోగా నటించిన వాళ్లు దర్శకులు కావడం మరీ తక్కువ. ‘ప్రేమ గీతం’, ‘జ్ఞాపకం’ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి దర్శకుడు అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఐతే అతను మెగా ఫోన్ పట్టి తీసిన తొలి చిత్రం ‘తొలి ప్రేమ’తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఈ కుర్రాడిలో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా అనిపించాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆ తర్వాత అతను తీసిన ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దె’ సినిమాల్లోనూ తన దర్శకత్వ ప్రతిభ కనిపించింది కానీ.. అవి పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ రెండు చిత్రాల్లో ఇబ్బంది పెట్టేది ద్వితీయార్ధమే. తన తొలి చిత్రం ‘తొలి ప్రేమ’లోనూ సెకండాఫ్ వీక్గానే ఉంటుంది.
ప్రథమార్ధం వరకు కథను ఇండియాలో నడపడం.. ద్వితీయార్ధానికి ఫారిన్కు షిఫ్ట్ అయిపోవడం వెంకీ స్టయిల్. మూడు చిత్రాల్లోనూ అదే జరిగింది. కానీ ఆ ఫారిన్ బ్యాక్డ్రాప్లో జరిగే తంతే అంతగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో వెంకీ మీద ఒక ముద్ర పడిపోయింది. అతను సెకండాఫ్ను లోకల్గా నడపలేడని.. ఫారిన్కు వెళ్లిపోతాడని.. అక్కడే అతడి వీక్నెస్ ఉందని కామెంట్లు చేస్తుంటారు. ఐతే ఇప్పుడు వెంకీ తన తొలి మూడు చిత్రాలకు భిన్నమైన కథతో ధనుష్ హీరోగా ‘సార్’ పేరుతో తమిళం, తెలుగులో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్ వీడియో చూశాక ఇదొక సీరియస్ మూవీ అనిపిస్తోంది. విద్యా వ్యవస్థ చుట్టూ సమస్యల కోణంలో నడిచే సినిమాలా కనిపిస్తోందిది. టైటిల్ మోషన్ పోస్టర్లో ఇంటెన్సిటీ కనిపించింది. ఐతే వెంకీ తొలి మూడు చిత్రాల అనుభవంతో అతడి మీద నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాలో అయినా సెకండాఫ్ను లోకల్గా నడిపిస్తాడా.. లేక ఈ ‘సార్’ను కూడా ఫారిన్కు పట్టుకుపోయి సినిమాను చెడగొడతాడా అని కౌంటర్లు వేస్తున్నారు. మరి వెంకీ స్టైల్ మార్చి ఈసారైనా పూర్తి స్థాయిలో మెప్పిస్తాడేమో చూడాలి.
This post was last modified on December 23, 2021 6:30 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…