రాజమౌళి మేటి దర్శకుడే కాదు.. తిరుగులేని మార్కెటింగ్ మాస్టర్ కూడా. తన సినిమాలను ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ప్రమోట్ చేసే తీరు గొప్పగా ఉంటుంది. ఒక తెలుగు సినిమాగా మొదలైన బాహుబలి దేశవ్యాప్తంగా ఇరగాడేసిందన్నా.. ప్రపంచ స్థాయికి చేరిందన్నా అందులో రాజమౌళి మార్కెటింగ్ స్కిల్స్ కూడా కీలకమే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ జక్కన్న తనదైన ప్రమోషనల్ ప్లానింగ్తో దూసుకెళ్తున్నాడు.
పీవీఆర్ వాళ్లతో డీల్ చేసుకున్నా.. వేర్వేరు నగరాల్లో వరుసబెట్టి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు పెట్టినా.. ముంబయిలో స్పెషల్ ఈవెంట్ చేసినా, ఇప్పుడు ప్రొ కబడ్డీతో టై అప్ అయి సినిమాను ప్రమోట్ చేసుకున్నా.. అందులో రాజమౌళి ముద్ర స్పష్టం. అయితే ఇవన్నీ బాగున్నాయి కానీ.. ముంబయిలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లైవ్ ఇవ్వకుండా దాన్ని ఆదాయ మార్గంగా మలుచుకోవడమే ఇటు ఇండస్ట్రీ జనాలకు, అటు ప్రేక్షకులకు రుచించడం లేదు.
లైవ్ ఇవ్వలేదంటే.. కొంచెం లేటుగా చిత్ర బృందం వీడియోలు రిలీజ్ చేస్తుందేమో అనుకున్నారు. కానీ ఈ ఈవెంట్ కవరేజ్ హక్కులను భారీ మొత్తానికి హాట్ స్టార్ వాళ్లకు అమ్మేసినట్లుగా చెబుతున్నారు. ఐతే చేసిందేమో ప్రమోషనల్ ఈవెంట్, జనాలకు సినిమాను చేరువ చేయడం దీని ఉద్దేశం.
అలాంటపుడు సోషల్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో ఈవెంట్ లైవ్ ఇచ్చి ప్రమోట్ చేయాలి కానీ.. ప్రమోషనల్ ఈవెంట్ హక్కులను ఓటీటీకి అమ్మి సొమ్ము చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. అసలిది సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఎలా అవుతుంది.. ఇదేం స్ట్రాటజీ అని ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రేక్షకులు. ఈ విషయంలో ముంబయి మీడియా వాళ్లు కూడా ఆగ్రహంగానే ఉన్నారట. మనతో కావాల్సినంత కవరేజీ ఇప్పించుకుని.. ఈ ఈవెంట్కు మీడియాను దూరం పెట్టి డబ్బు చేసుకోవడం ఏంటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారట.
This post was last modified on December 23, 2021 11:07 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…