నటిగా టబుది ఓ డిఫరెంట్ జర్నీ. ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి కమర్షియల్ హిట్ చిత్రాల్లో నటించింది. ‘చాందినీబార్’లాంటి సీరియస్ కాన్సెప్టులతోనూ మెప్పించింది. ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకుంది. కెరీర్ మొదట్నుంచీ కూడా ఏది పడితే అది చేసేయకుండా ఓ ప్రత్యేకతను చూపించుకుంటూ వచ్చింది. ఇప్పటికీ అదే తీరు. అందుకే తనపై అందరికీ ఓ స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది.
చాలా గ్యాప్ తర్వాత ‘అల వైకుంఠపురములో’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది టబు. రిచ్ ఉమన్గా.. భర్త చేసిన మోసంతో తనలో తనే రగిలిపోయే భార్యగా.. కొడుకే ప్రపంచం అనుకునే తల్లిగా.. అన్ని రకాల ఎమోషన్స్ని తనదైన శైలిలో పండించి వహ్వా అనిపించింది. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆ టీమ్కి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది టబు. కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘షెహ్జాదా’ పేరుతో బాలీవుడ్లో రీమేక్ అవుతోంది ‘అల వైకుంఠపురములో’.
దిల్రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్ గిల్ నిర్మిస్తున్నారు. కృతీ సనన్ హీరోయిన్. షూటింగ్ జోరుగా సాగుతోంది. లొకేషన్లో డైరెక్టర్తో దిగిన ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కార్తీక్. అది చూసిన టబు.. ‘జాగ్రత్తగా రీమేక్ చేయండి.. అది నా సినిమా’ అని కామెంట్ చేసింది. దానికి ఆర్యన్ కూడా రియాక్టయ్యాడు. ‘మీ సినిమా కనుకనే మరింత ప్రేమతో తీస్తున్నాం’ అని జవాబిచ్చాడు.
అల వైకుంఠపురములో బన్నీ కెరీర్లోనే ఓ స్పెషల్ మూవీ. ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. రికార్డులు బద్దలు కొట్టింది. ముఖ్యంగా పాటలు, వాటిలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు అదరగొట్టాయి. అలాంటి సినిమాని రీమేక్ చేస్తున్నారంటే అందరి దృష్టీ ఉండటం కామన్. అయితే టబు పాత్రని హిందీలో కూడా ఆమే చేసివుంటే బాగుండేదని చాలామంది ఫీలవుతున్నారు. కానీ చేసిన పాత్రే మళ్లీ చేయడానికి ఆమె ఒప్పుకోలేదట. దాంతో మనీషా కొయిరాలాని తీసుకున్నారు. ఆమె కూడా మంచి నటే కానీ టబు ఉంటే ఆ హుందాతనమే వేరు అనేది ఎక్కువమంది ఫీలింగ్.
This post was last modified on December 22, 2021 6:05 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…