టాలీవుడ్లో కొందరు హీరోలు రీమేక్లకు బాగా దూరంగా ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు గురించి. హీరో అయ్యాక రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో మహేష్ ఒక్క రీమేక్లోనూ నటించలేదు. ఇక ముందు కూడా నటించేది లేదని తేల్చి చెప్పేశాడతను. రీమేక్లంటే భయమని, ఇంకొకరు చేసిన కథలో నటించడానికి తనకు ఎగ్జైట్మెంట్ కలగదని మహేష్ చెప్పాడు.
జూనియర్ ఎన్టీఆర్ సైతం రీమేక్లకు దూరంగా ఉండేవాడే. నరసింహుడు మినహా అతడి కెరీర్లో రీమేక్స్ లేవు. ఇప్పుడు నాని సైతం ఈ జాబితాలో చేరుతున్నాడు. రీమేక్లు తనకు సెట్ కావని.. తాను ఇకపై ఎప్పుడూ రీమేక్ల్లో నటించనని అతను తేల్చి చెప్పేశాడు. ఐతే నాని ఇప్పటిదాకా రీమేక్లు చేయలేదనేం లేదు. భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం రీమేక్లే. అవి రెండూ అతడికి నిరాశనే మిగిల్చాయి. వాటి అనుభవాలతోనే నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నాడు.
ఇప్పటిదాకా చేసిన రెండు రీమేక్లు తనకు పాఠాలు నేర్పాయని.. తనకు రీమేక్లు పడవని అర్థమైందని నాని చెప్పాడు. ఒక కొత్త కథ కోసం తాను ఎంతైనా కష్టపడటానికి సిద్ధమని.. తన ఆలోచన విధానం రీమేక్లకు సరిపోదని, వాటి పట్ల తనకు ఎగ్జైట్మెంట్ కలగదని నాని అన్నాడు. అందుకే భవిష్యత్తులో కూడా రీమేక్లు చేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు నాని తెలిపాడు.
తాను రీమేక్లు చేయడం కంటే తన సినిమాలను వేరే భాషల్లో రీమేక్ చేయడం తనకు బాగా అనిపిస్తోందని నాని చెప్పాడు. జెర్సీ, నిన్ను కోరి, భలే భలే మగాడివోయ్, నేను లోకల్.. ఇలా నాని సినిమాలు చాలానే వివిధ భాషల్లో రీమేక్ అయ్యాయి. ముఖ్యంగా జెర్సీ హిందీ రీమేక్ మీద అక్కడ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రిలీజవుతున్న టైంలోనే నిన్ను కోరి తమిళ రీమేక్ కూడా విడుదలకు సిద్ధం అవుతుండటం విశేషం.
This post was last modified on December 22, 2021 1:24 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…