‘పుష్ఫ’… ఇప్పుడు టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంతో ఈ సినిమా గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ‘పుష్ప’లో విలన్గా నటిస్తాడనే విషయం ఇంకా కన్ఫార్మ్ కాకముందే, ఈ ప్రాజెక్ట్లో మరో బాలీవుడ్ స్టార్ ఆడిపాడనుందని టాక్ వినిపిస్తోంది.
సుకుమార్, బన్నీ కాంబో అంటే ఐటెమ్ సాంగ్ తప్పనిసరి. ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ సూపర్ హిట్స్గా నిలిచాయి. దాంతో ‘పుష్ప’లో కూడా అదిరిపోయే ఓ ఐటెమ్ సాంగ్ ఉండాలని ఫిక్స్ అయ్యారట సుక్కూ అండ్ బన్నీ.
ఇందుకోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాను సంప్రదిస్తున్నట్టు ఫిల్మ్నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ 4’ సినిమాలతో బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఊర్వశి, సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది.
బికినీ ఫోజులు, హాట్ ఫోటోషూట్స్తో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఊర్వశి, బన్నీ పక్కన ఐటెం సాంగ్ చేస్తే మాస్ ఏరియాల్లో మోత మోగిపోవడం గ్యారెంటీ. అయితే ఊర్వశి కంటే ముందు ఈ ఐటెమ్ సాంగ్ కోసం కియారా అద్వానీని సంప్రదించారట. ‘వినయవిధేయ రామ’ తర్వాత తెలుగులో కనిపించని కియారా, బాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ యమా బిజీగా ఉంది.
ఈ ఏడాది నాలుగు సినిమాల్లో నటిస్తున్న కియారా, తెలుగులో ఐటెమ్ సాంగ్కి నో చెప్పడంతో ఆ ప్లేస్లోకి ఊర్వశి వచ్చిందని టాక్. ఒక్క పోస్టర్తోనే ఇన్ని రకాల వార్తలు పుట్టుకొస్తే, మున్ముందు ‘పుష్ఫ’ గురించి ఎన్ని వార్తలు వినాల్సి వస్తుందో మరి!!
This post was last modified on April 17, 2020 5:34 pm
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…